తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున్న జరుగుతున్న సమయంలో అప్పటి ఉద్యమ నేతగా మావోయిస్టుల ఎంజెడాకు తగ్గట్టుగానే పాలన కొనసాగిస్తానంటూ ఇప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు పదులసార్లు నొక్కి చెప్పటం చూశాం. ప్రభుత్వం ఏర్పాటయ్యాక, అంతేందుకు ఈ మూడేళ్లలో కూడా మావో వ్యతిరేక విధానాలు ఎక్కడా అవలంభించిన దాఖలాలు అయితే కనిపించలేదు కూడా. అయితే ఓవైపు రైతులకు రుణమాఫీలంటూ ప్రకటనలు కురిపిస్తూనే, వారిపై కేసులు బనాయించటం అన్నలకు ఆగ్రహాం తెప్పిస్తోంది.
మొన్నామధ్య ఖమ్మంలో రైతుదీక్ష సందర్భంగా రైతుల చేతులకు సంకెళ్లు వేసి తీసుకెళ్లిన ఉదంతం తెలిసిందే.అందుకు బాధ్యులైన అధికారులను సస్పెన్ చేసి చర్యలు తీసుకునే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పార్టీల కతీతంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. మరోపక్క మావో నేతలు కూడా దీనిపై నిప్పులు కురించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మరిచిన సీఎం కేసీఆర్ నియంతృత్వ పాలన సాగిస్తున్నారని, నిజాంను తలదన్నే రీతిలో నియంతృత్వాన్ని కొనసాగిస్తున్నారని మావోయిస్టు పార్టీ కార్యదర్శి ఆజాద్ ఓ లేఖలో విమర్శలు చేశాడు.
తెలంగాణ ప్రభుత్వంపై అన్ని వర్గాల ప్రజలు మిలిటెంట్ పోరాటాలు సాగించాలని పిలుపు నిచ్చాడు. ఒకేసారి రుణమాఫీ అని చెప్పి దఫదఫాలుగా చేస్తోందని, అందులోనూ స్పష్టత, పరిపూర్ణత లేకపోవటంతో గత్యంతరం లేని పరిస్థితిలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలిపాడు. రైతుల ఆత్మహత్యలను ఆపలేని ప్రభుత్వం, ఇతర కారణాలు చూపుతూ వారి చావులకు వాళ్లే బాధ్యులు అంటూ కొందరు నేతలు వ్యాఖ్యలు చేయటం దారుణమన్నాడు.గిట్టుబాటు ధర ఇప్పించాలని ఆందోళన చేసిన రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని, వారిపై పెట్టిన కండీషన్డ్ బెయిల్ ను రద్దు చేయాలని ఆ లేఖలో డిమాండ్ చేశాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more