ఆమ్ ఆద్మీ పార్టీ బహిష్కృత నేత కపిల్ మిశ్రా పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై వార్ ప్రకటించాడు. తన మాజీ గురు పైనే పోలీస్ కేసు పెట్టబోతున్నట్లు ప్రకటించాడు. అవినీతికి పాల్పడ్డ కేజ్రీవాల్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన కపిల్.. దమ్ముంటే ఎన్నికలకు రావాలంటూ బహిరంగ సవాలు విసిరాడు
తనకు కేజ్రీవాల్ నియోజకవర్గమైనా, తన నియోజకవర్గమైన ఒకటేనని ఆయన చెప్పారు. కేజ్రీవాల్ కు వందిమాగధులు, ప్రత్యేక టీమ్ ఉన్నాయని, తనపై పోటీకి వారందరి సహాయ సహకారాలు తీసుకోవచ్చని ఆయన సూచించారు. తాను ఒంటరి వాడినని, ఒంటరిగానే పోరాడుతానని ఆయన చెప్పారు. కేజ్రీవాల్ నుంచి తాను పోరాటాన్ని నేర్చుకున్నానని ఆయన తెలిపారు. ఈ బహిరంగ లేఖ కూడా ఆయన ఆశీర్వాదం కోసమే రాశానని ఆయన చెప్పారు. కేజ్రీవాల్ పై పోరాటంలో విజయం సాధించాలని కోరుకుంటున్నానని ఆయన తెలిపారు. అందుకే కేజ్రీవాల్ తనను ఆశీర్వదించాలని ఆయన కోరారు.
ఈ రోజే కేజ్రీవాల్ మీద కేసు పెడుతున్నానని ఆయన చెప్పారు. పార్టీ మీటింగ్ లో కేజ్రీవాల్ తన అనుచరులతో తిట్టిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఎవరేంటో తెలుసుకోవాలంటే కేజ్రీవాల్ ప్రజా కోర్టులో తేల్చుకోవాలని, అలా తేల్చుకోవాలంటే...పదవికి రాజీనామా చేసి, తనపై పోటీ చేసి, గెలవాలని ఆయన సవాలు చేశారు. 400 కోట్ల స్కాంలో క్రేజీ వాల్ హస్తం ఉందంటూ ఈ బహిష్కృత మంత్రి సాక్ష్యాలతో సహా ఆరోపించటంతో కపిల్ ను పార్టీ నుంచి వెలివేశారు.
అయితే గత సాయంత్రం తనపై వస్తున్న ఆరోపణలపై కేజ్రీవాల్ ట్విట్టర్ లో స్పందించాడు. సత్యమే గెలుస్తుంది... ఒక్క రోజు అసెంబ్లీ సమావేశంలో అసలు విషయాలు వెలుగు చూస్తాయంటూ ట్వీట్ చేశాడు. ఆయన సతీమణి ఏకంగా తన మరిది(కపిల్ మిశ్రాను ఉద్దేశించి) ఇక లేడంటూ ట్వీట్ చేయటం విశేషం.
అన్నివైపులా దండయాత్ర...
తన కళ్ల ముందే సత్యేంద్ర జైన్ నుంచి రూ. 2 కోట్లు లంచాన్ని కేజ్రీవాల్ తీసుకున్నారంటూ ఆప్ నేత, మంత్రి కపిల్ మిశ్రా తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి కూడా మరో అవినీతి ఆరోపణను తెరపైకి తెచ్చారు. ఓ ప్రైవేట్ కంపెనీ నుంచి కేజ్రీవాల్ రూ. 2 కోట్లు లంచం తీసుకున్నారంటూ స్వామి తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఆయన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ కు లేఖ రాశారు. కేజ్రీవాల్ పాల్పడిన ఈ అవినీతిపై వెంటనే విచారణ చేపట్టాలని లేఖలో కోరారు. రూ. 50 లక్షల చెప్పున నాలుగు దఫాలుగా కేజ్రీవాల్ నగదును పుచ్చుకున్నారని... క్విడ్ ప్రోకోలో భాగంగానే ఈ అవినీతి జరిగిందని పేర్కొన్నారు. కేజ్రీవాల్ పై తాను చేసిన ఆరోపణలకు ఆధారాలు ఉన్నాయని కూడా స్వామి తెలిపాడు.
మరో బహిష్కృత ఎమ్మెల్యే ఆసిమ్ అహ్మద్ ఖాన్ కూడా కేజ్రీవాల్ పై ఆరోపణలు చేశాడు. ఆయన అనుచరులు తనను రూ. 5 కోట్లు డిమాండ్ చేశారని వెల్లడించారు. పార్టీని ప్రైవేటు కంపెనీలా మార్చేశారని ధ్వజమెత్తారు. పార్టీ అవినీతికి కపిల్ మిశ్రాను బలిపశువు చేశారని వాపోయారు. కేజ్రీవాల్ను వ్యతిరేకించే వారిని పార్టీ నుంచి గెంటేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more