టెక్నాలజీ యుగంలో ఎంత అభివృద్ధి జరిగినా, ఇంకా జరుగుతున్నా తప్పిదాలు అనేవి సర్వసాధారణంగా మారిపోయాయి. ముఖ్యంగా టైం లేక యాప్ ల మీద పడిపోతున్న వారికి షాకింగ్ అనుభవాలనే మిగులుస్తున్నాయి. మొన్నామధ్య ఓలా సంస్థ ఓ ప్రయాణికుడికి ఊహించని రీతిలో ఛార్జీ వేసి వణికించగా, ఇప్పుడు ఉబెర్ వంతు వచ్చింది.
బెంగళూరు రైల్వేస్టేషన్ లో దిగిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మైసూరు రోడ్డులోని శాటిలైట్ బస్టాప్ దగ్గర్లో ఉన్న తన ఇంటికి వెళ్లేందుకు ఉబర్ క్యాబ్ ను బుక్ చేసుకున్నాడు. ఆ రెండింటికి మధ్య దూరం కేవలం ఐదు కిలో మీటర్ల దూరం. క్యాబ్ వచ్చాక ఎంచాక ఎక్కి కూర్చున్న అతను తన గమ్యస్థానం రావటంతో దిగిపోయాడు. అప్పుడు క్యాబ్ డ్రైవర్ 5,325 రూపాయల బిల్లు అతని చేతిలో పెట్టడంతో ఒక్కసారిగా నోరు తెరిచాడు.
తాను గతంలో ఈ రూట్ లో చాలా సార్లు ప్రయాణించానని చెప్పుకొచ్చాడు. అయితే ఇది గతంలో చేసిన జర్నీలకు సంబంధించిన బిల్లు అని చెప్పటంతో ఆ ప్రయాణికుడు అవాక్కయ్యాడు. తాను కేవలం రెండు సార్లు మాత్రమే ప్రయాణించానని ఆ మాత్రంకే అంత బిల్లు వేస్తారా? అంటూ మండిపడ్డాడు. డ్రైవర్ చెల్లించాల్సిందేనని పట్టుబట్టడంతో మాటా మాటా పెరిగి విషయం పోలీస్ స్టేషన్ దాకా వెళ్లింది. ఈ లోపు కస్టమర్ కేర్ కు కాల్ చేయగా, తమకు ఏం తెలీదని వ్యవహారం స్టేషన్ లోనే తేల్చుకోండని చెప్పటం కొసమెరుపు. బైతనాపుర స్టేషన్ కి చేరుకోగా అక్కడ కేవలం 103 వసూలు చేయించి, డ్రైవర్ కి సర్దిచెప్పి.. ప్రయాణికుడిని పంపిచేశారు.
ఈ విషయమై ఉబర్ ను సంప్రదించగా సాంకేతిక లోపం కారణంగా ఈ తప్పిదం చోటుచేసుకుందని, దీనికి చింతిస్తున్నామని తెలిపింది. ఏదైనా ఇలా ప్రయాణికులను క్యాబ్ సంస్థలు బెంబేలెత్తిస్తున్న ఘటనలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more