హైదారబాద్ జీహెఛ్ఎంసీలో రోడ్ల మరమ్మతుల కోసం గ్రేటర్ హైదరాబాద్ విడుదల చేసిన సుమారు 300 కోట్ల రూపాయల నిధులను ఎలాంటి పనులు చేయకుండా అప్పనంగా స్వాహా చేశారని, ఇందుకు సంబంధించి జీహెచ్ఎంసీ కమీషనర్ అంతర్గత విచారణకు సైతం అదేశించారని చెప్పి అధికార పార్టీలో కలకలం రేపిన కాంగ్రెస్ సీనియర్ నేత, నిజామాబాద్ మాజీ పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ గౌడ్.. మరో సారి కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ అంతకుమించిన అరోపణలు చేశారు.
అయితే ఆ ఆరోపణలు కొట్టిపారేసిన టీఆర్ఎస్ పార్టీ వర్గాలు జీహెచ్ఎంసీలో నిధులు విడుదల చేయాలని సంకల్పించామని, అయితే రోడ్లు మరీ అద్వాన్నంగా వున్న ప్రాంతాలను ఎంచుకుని వాటిని వరుస క్రమంలో మరమ్మతులు చేస్తున్నట్లు వివరణ ఇచ్చారు. మొత్తానికి హైదరాబాద్ రోడ్లన్నీ మరమ్మతులు తరువాత కొత్త కళను సంతరించుకున్నాయి. అయితే తాజాగా మధుయాష్కీ చేసిన అరోపణలు మాత్రం ఏకంగా అవినీతి రహిత పాలనను అందిస్తున్నామని చెప్పుకుంటున్న అధికార పార్టీ పరువు ప్రతీష్టలను దెబ్బతీసేలా వున్నాయి.
పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానిది దిక్కుమాలిన నిర్ణయం అని గతేడాది నవంబర్ 16న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించిన నేపథ్యంలో ఆయనపైకి కేంద్రం అస్త్రాలను సంధించిందని.. దీంతోనూ ఆయస గత్యంతరం లేని పరిస్థితుల్లో కేంద్ర నిర్ణయానికి మద్దతు పలికారని మధుయాష్కీ అరోపించారు. అయితే ఏమిటా అస్త్రం అని అడుగుతున్నారా..? ఇక్కడి నుంచి నిధులను అక్రమంగా విదేశాలకు మళ్లించి.. మనీలాండరింగ్ కు పాల్పడ్డారని అరోపించారు. రాష్ట్రంలో అవినీతి రహిత పాలన జరుగుతున్న క్రమంలో నిధులు మళ్లింపు ఎలా జరుగిందన్నది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు.
అంతకుముందు ముఖ్యమంత్రి కేసీఆర్ సహా తన కుటుంబ సభ్యులకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నోటీసులు ఇచ్చిందని మధుయాష్కి ఆరోపించారు. కేసీఆర్ కుమారుడు కే తారక రమారావు, కుమార్తె కవిత, అల్లుడు హరీష్ రావులకు ఈడీ నోటీసులు ఇచ్చిన మాట వాస్తవం కాదా..?అని ఆయన ప్రశ్నించారు. ఈడీ నోటీసులు ఇచ్చినట్టు తన వద్ద సమాచారం ఉందని తేల్చిచెప్పారు. ఈ నోటీసుల ప్రభావానికి లొంగిపోయిన కేసీఆర్ కేంద్రం పెద్దనోట్ల రద్దుకు మద్ధతిచ్చారని మధుయాష్కి పేర్కొన్నారు. ఇది నిజమో కాదో సీఎం కేసీఆర్ స్పష్టం చేయాలన్నారు. అలాగే జీహెచ్ఎంసీ రోడ్ల పనుల్లో అవినీతిపై చర్యలు తీసుకోలేదని ఆయన అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more