అమ్మ మరణానంతరం శశికళ పగ్గాలు చేపట్టే టైంలో కూడా పక్కనే ఉండి కిక్కురుమనకుండా ఉండిపోయిన పన్నీర్ సెల్వం, తిరుగుబాటు ఎవరూ ఊహించలేనిదే. సమాధి సాక్షిగా ఓపీఎస్ నడిపిన హైడ్రామా తమిళ రాజకీయాల్లో చెరగని ముద్రను వేసి పడేసింది. ఆపై థ్రిల్లర్ సినిమాను తలపిస్తూ సాగిన స్టోరీ చివరకు చిన్నమ్మ అరెస్ట్ తో చల్లబడింది. అయినప్పటికీ పార్టీ పై పట్టు కోల్పోకుండా అల్లుడు దినకరన్ ను అన్నాడీఎంకే లో కీలక బాధ్యతల్లో ఇరికించి మరీ చెరసాలను వెళ్లింది.
అయితే శశికళ వ్యవహారం, దినకరన్ తో తలనొప్పులు నచ్చని కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు ఎలాగైనా మన్నార్ గుడి మాఫియాను దూరం చేయాలని అదను కోసం ఎదురు చూడసాగారు. ఆర్కే నగర్ ఉపఎన్నిక ప్రచార సందర్భంగా ఓటుకు నోటు, ఈసీ లంచం వ్యవహారం బయటపడటంతో ఈ ఛాన్స్ దక్కినట్లయ్యింది. అంతే అన్నాడీఎంకే నుంచి శశికళ కుటుంబాన్ని బహిష్కరించడం, రెండుగా విడిపోయిన అన్నాడీఎంకే మళ్లీ ఒక్కటి అయ్యేందుకు బీజం పడింది. ఈ నేపథ్యంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం హుషారుగా ఉన్నాడు.
‘అమ్మ’ సమాధి సాక్షిగా వీలైనంత త్వరగా విలీనాన్ని పూర్తిచేసేందుకు యత్నిస్తున్నాడు. తన వర్గం నేతలు, కార్యకర్తలతో బుధవారం సమావేశం నిర్వహించిన తర్వాత మీడియాతో మాట్లాడాడు. తాను చేస్తున్న ధర్మయుద్ధంలో తొలి విజయం లభించిందని పేర్కొన్నారు. అమ్మ మరణం తర్వాత పార్టీని హస్తగతం చేసుకున్న శశికళ, ఆమె కుటుంబ సభ్యులను తరిమికొట్టేంత వరకు తన పోరాటం ఆగదని తిరుగుబాటు సందర్భంగా ప్రకటించానని గుర్తు చేసిన సెల్వం, అది నెరవేరిందని, తాను చేసిన ధర్మయుద్ధంలో తొలి విజయమని(టార్గెట్ ఇంకా ఏమైనా ఉందా?) పేర్కొన్నాడు.
తన లక్ష్యం నెరవేరిందని, ఇక విడిపోయిన రెండు వర్గాలు వీలైనంత త్వరగా ఏకతాటిపైకి వచ్చి పార్టీని బలోపేతం చేయటం, అమ్మ ఆశయాలను అనుగుణంగా పాలన కొనసాగించటం మిగిలిందని చెబుతున్నాడు. ఏది ఏమైనా ఇన్నాళ్లూ విమర్శించిన మంత్రులే ఆయనను విపరీతంగా పొగిడేస్తున్నారు. విశ్వాసానికి ఆయన ప్రతీక అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more