దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో గో రక్షణ సమితి పేరిట జరుగుతున్న దాడులపై జవాబివ్వాలని కేంద్రాన్ని అదేశిస్తూ దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇవాళ నోటీసులను జారీ చేసింది. దీంతో పాటు బీజేపీ ప్రభుత్వాలు అధికారంలో వున్న రాష్ట్రాల్లో కూడా ఈ దాడులు మరింత తీవ్రస్థాయిలో వున్నాయని, ఈ దాడుల్లో పలువురు మరణిస్తున్నారని అవేధన వ్యక్త చేసిన కేంద్రం.. బీజేపి పాలిత ఆరు రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. గో సంరక్షణ పేరిట జరుగుతున్న దాడులపై మూడు వారాల్లోగా వివరణ ఇవ్వాలంటూ అదేశించింది.
అటు కేంద్రంలో అధికారంలో వున్న మోడీ సర్కారుతో పాటుగా రాజస్థాన్, జార్ఖండ్, చత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వాలకూ ఇవాళ శ్రీముఖాలను పంపింది. రాజస్థాన్లోని అల్వార్ లో ఓ ముస్లిం వ్యక్తిపై గో సంరక్షకులు దాడి చేయగా అతడు చనిపోయాడు. ఈ విషయం ఇప్పుడు అటు పార్లమెంటును కుదిపేస్తోంది. ప్రతిపక్ష పార్టీలు సైతం అధికార పక్షంపై దీనితో దాడి చేస్తున్నారు. ఈ తరుణంలో దాఖలైన పిటీషన్ పై విచారించిన న్యాయస్థానం.. గో రక్ష దళాలకు శిక్షలు పడకుండా ప్రభుత్వమే రక్షణ కవచంలా వుంటుందా..? అని పిటీషనర్ అనుమానాలను వ్యక్తం చేస్తున్నరని.. ఈ విషయమై కూడా వివరణ ఇవ్వాలని అదేశించింది.
ఈ నేపథ్యంలో అల్వార్ ఘటనపై మూడు వారాల్లోగా వివరణ ఇవ్వాలంటూ రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుందర రాజేకు సుప్రీంకోర్టు నోటీసులు పంపించింది. పెహ్లూ ఖాన్ అనే వ్యక్తి గోవులను ట్రక్కులో తీసుకొని వెళుతుండగా ఎక్కడ కొనుగోలు చేశావని, ఎందుకు తీసుకెళుతున్నావని ప్రశ్నించి అనంతరం దాడి చేయడంతో అతడు చనిపోయిన విషయం తెలిసిందే. అయితే, ప్రభుత్వం మాత్రం అలాంటి ఘటనేది జరగలేదని రాజ్యసభలో చెప్పడంతో పెద్ద ధుమారం చెలరేగింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more