ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక్కడి అత్యాశ వల్లే ఇవాళ యావత్ రాష్ట్ర యువత భవిష్యత్తు అంధకారమయమైందని సినీనటుడు, ఏపీ సాధన సమితి అధ్యక్షుడు శివాజీ అరోపించారు. ఏపీలో అధికారంలో వున్న తమ పార్టీ.. అటు తెలంగాణాలోనూ ఉనికి చాటాకోవాలని భావించిన చంద్రబాబు.. ఎమ్మెల్యే ఓటును కొనుగోలు చేసేందుకు యత్నించి ఏసీబి అధికారులకు అడ్డంగా దొరికిపోయారని దాంతోనే బ్లాక్ మెయిల్ చేస్తున్న కేంద్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా చేసిందని అభిప్రాయపడ్డారు.
ఓటుకు నోటు కేసులో చంద్రబాబు ఇరుక్కోకుంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఏనాడో లభించి వుండేదని పేరన్కోన్నారు. ఈ ఉదయం తిరుమల శ్రీవారి దర్శనానాకి వచ్చిన ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... కేసుల్లో ఇరుక్కుని, కేంద్రం చెప్పినదానికల్లా చంద్రబాబు తలూపాల్సిన పరిస్థితిని తెచ్చుకున్నారని విమర్శించారు. దీనికి తోడు పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం, లోపభూయిష్టపు పనులు కూడా ప్రత్యేక హోదా అవరోధంగా నిలిచాయని అరోపించారు.
ప్రత్యేక హోదా వల్ల ప్రయోజనం శూన్యమని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబే స్వయంగా ప్రచారం చేస్తుండటాన్ని శివాజీ తప్పుబట్టారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ విషయాన్నే చంద్రబాబు ఎందుకు ప్రచారం చేయలేదని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు చెబుతున్న కథలను ప్రజలు వింటున్నారని, ఇక ఈ విషయంలో మాట్లాడేది ఏముందని ఆయన మీడియానే ఎదురు ప్రశ్నించారు. చంద్రబాబు ఏం చెబితే అదే మహాభారతం, రామాయణం అయిపోయిందని ఎద్దేవా చేశారు. ఓటుకు నోటు, పట్టిసీమ ప్రాజెక్టులో అవినీతిపై విచారణ లేకుంటే హోదా ఎన్నడో వచ్చేదన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more