మీరు మొబైల్ ఫోన్ వినియోగదారులేనా.. అయితే మీ ఆధార్ నెంబర్ మీకు తెలుసా..? గుర్తుంటే పర్వాలేదు.. అలా లేని పక్షంలో మీ ఆధార్ నెంబర్ ను వెంటనే రాసి పెట్టుకోండి సాధ్యమైతే మీ ఆధార్ నెంబర్ జిరాక్స్ కాఫీని కూడా తీసిపెట్టుకోండి. మీ మొబైల్ ఫోన్ టెలికాం సంస్థ నుంచి త్వరలో మీకు ఓ ఫోన్ కాల్ రావచ్చు. మీ అధార్ నెంబర్ ను పంపాలని, లేక పలానా నెంబర్ కు మీ అధార్ నెంబర్ ను ఎస్ఎంఎస్ చేయాలని చెప్పవచ్చు. అదీకాకపోతే మీకు దగ్గర్లో వున్న సంస్థ కార్యాలయానికి వెళ్లి మీ ఫోన్ నెంబర్ రాసి మీ అధార్ నెంబర్ జిరాక్స్ కాపీని ఇవ్వాలని కూడా అదేశించవచ్చు.
ఎందుకంటే త్వరలో కొత్త సర్వే ప్రారంభంకానుంది. దేశంలోని అనేక మంది ఫేక్ అడ్రస్ లు, నకిలీ గుర్తింపుకార్డుల పేరుతో అనేక సిమ్ కార్డులు తీసుకున్నారని దీంతో ఎవరు వారు సంఘవిద్రోహ కార్యకాలపాలతో పాటు అకతాయి పనులకు కూడా పునుకుంటున్నారని, వీరి ఫోన్ నెంబర్ అధారంగా దర్యాప్తు సంస్థలు తనిఖీలు చేసినా.. వారి ఆచూకీ అంతా తప్పని తేలుతుందని పిల్ దాఖలైన నేపథ్యంలో దానిపై విచారించిన దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఈ మేరకు టెలికాం సంస్థలకు అదేశాలు జారీ చేసింది.
ఇన్నాళ్లు ఏదో ఒక గుర్తింపు వుంటేనే దక్కిన సిమ్ కార్డులకు ఇకపై తప్పనిసరిగా ఆధార్ నెంబర్ వుండాల్సిందే. దీంతో టెల్కో సంస్థలు ఇకపై ఆదార్ నెంబర్ లేకుండా కొత్త సిమ్ కార్డులు జారీ చేయడానికి విముఖత వ్యక్తం చేస్తున్నాయి. అంతేకాదు ఇప్పటి వరకు జారీ చేసిన సిమ్ కార్డులకు కూడా ఆధార్ నెంబర్లు సేకరించాలన్న అత్యున్నత న్యాయస్థానం అదేశంలో ఇకపై కస్టమర్ల నుంచి ఆధార్ నెంబర్లను సేకరించే పనిలో పడ్డాయి టెలీ కమ్యూనికేషన్ సంస్థలు. అయితే మొత్తంగా 110 టెలికాం వినియోగదారుల ఆధార్ నెంబర్లను సేకరించాలంటే ఏకంగా 2500 కోట్ల రూపాయల వ్యయం ఖర్చవుతుందని సంస్థలు సుప్రీంకోర్టుకు తెలిపాయి.
అయినా సరే.. వినియోగదారుల నుంచి స్పష్టమైన గుర్తింపు కింద ఆధార్ కార్డులను వివరాలను సేకరించాల్సిందేనని సర్వోన్నత న్యాయస్థానం అదేశింది. వచ్చే ఏడాది పిబ్రవరి 8 నాటికి మొబైల్ ఫోన్ వినియోగాదారుల వివరాలన్నీ కూడా ఆయా టెలికాం సంస్థల వద్ద వుండాలని న్యాయస్థానం అదేశించింది. అయితే ఇప్పటికే టెలికాం సంస్థల మధ్య తీవ్రమైన టారిఫ్ వార్ నడుస్తున్న నేపథ్యంలో కోట్లాది రూపాయల ఖర్చు చేయాల్సి వస్తుందని టెలికాం కంపెనీలు ఊసురుమంటున్నాయి. అయినా తప్పని పరిస్థితి. అయితే వివరాలను సేకరించే విషయంలో ఎలా చేయాలన్న విషయమై ఇంకా ఓ కొలిక్కి రాలేదని కూడా చెబుతున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more