సమస్యల సత్వర పరిష్కారానికి మన నేతలు ఎంత చిత్తశుద్ధితో పని చేస్తారో లేదో తెలీదుగానీ ఇక్కడో మంత్రి చేసిన పని మాత్రం ఓ మహిళ జీవితాన్ని కాపాడిందనే చెప్పుకోవచ్చు. తన భార్యపై అఘాయిత్యానికి ప్రయత్నిస్తున్నారంటూ ఓ వ్యక్తి ఫోన్ కాల్ చేస్తే సత్వరమే స్పందించిన ఆ మంత్రి వేధింపులను అడ్డుకునేలా చర్యలు తీసుకోవటమే కాదు, ఆ కిరాతకులను కటకటాల వెనక్కి నెట్టేలా చేసింది.
సమాచార హక్కు చట్టం కింద ఓ కేసు నమోదు కావటంతో విచారణ కోసం ఆదివారం ఓ దంపతులు డెహ్రాడూన్ సమాచార హక్కు కార్యాలయానికి వచ్చారు. సమయం గడిచిపోవటంతో భోజనం చేసి రాత్రి 11 గంటల సమయంలో కార్యాలయంలోనే నిద్రించారు. ఆ ఆఫీస్ లోనే పని చేస్తున్న ఇద్దరు ఉద్యోగులు మహిళపై కన్నేసి మరో ఇద్దరు స్నేహితులను పిలిపించుకుని వేధింపులకు దిగారు. అడ్డుకున్న భర్తను చితకబాదటమే కాదు, మహిళపై అఘాయిత్యానికి ప్రయత్నించబోయారు. వెంటనే సదరు వ్యక్తి పితోఘర్ ఎమ్మెల్యేకు ఫోన్ చేసి సమాచారం అందించాడు.
ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రకాశ్ పంత్. మొన్న జరిగిన ఉత్తరాఖండ్ కేబినెట్ విస్తరణలో మంత్రిగా కూడా బాధ్యతలు స్వీకరించాడు. వెంటనే ఎస్ఎస్పీ స్వీటీ అగర్వాల్ కు ఫోన్ చేసిన పంత్ వారిని ఆదుకోవాలని ఆదేశించాడు. ఆవెను వెంటనే సిబ్బందితోసహా బయల్దేరిన ఆయన నిందితులను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. డైరెక్టరేట్ ఉద్యోగులు జగ్మోహన్ సింగ్ చౌహాన్, అనిల్ రావత్, హరిసింగ్ పెత్వాల్ మరియు జగదీశ్ సింగ్ (టీ స్టాల్ యజమాని) లపై సెక్షన్ 354(ఏ) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఒకవేళ ఆయన గనుక ఆలస్యంగా స్పందించి ఉంటే ఘోరం జరిగి ఉండేదన్న సదరు బాధిత భర్త మంత్రికి కృతజ్నతలు తెలియజేశాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more