అమరావతి సాక్షిగా జరుగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా కొనసాగుతున్నాయి. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య సభలోనే కాదు, బయటకూడా మాటల తూటాలు పేలుతున్నాయి. మంగళవారం జరిగిన సమావేశంలో జగన్ వ్యవహారశైలిపై అధికారపక్షం విరుచుకుపడగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. దీంతో స్పీకర్ సభను వాయిదా వేయగా, అక్కడే అసలు సీన్ మొదలైంది.
మీడియా పాయింట్ వద్ద టీడీపీ ఎమ్మెల్యే అనిత, వైసీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిలు సవాళ్లు విసురుకున్నారు. ఒకానోక సమయంలో ఇద్దరూ తీవ్ర స్థాయిలో వాగ్యుద్ధానికి దిగారు. సీఎం చంద్రబాబు తల నరుకుతానని తాను ఎన్నడూ అనలేదని, అది నిజమని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని గిడ్డి ఈశ్వరి స్పష్టం చేయగా... సీఎం తల నరుకుతానని ఈశ్వరి అన్నట్టు పోలీసు విచారణలో తేలిందని అనిత కౌంటర్ ఇచ్చింది.
టీడీపీ పాలనలో మహిళలపై దాడులు ఎక్కువయ్యాయని ఈశ్వరి అనగా... ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు వైసీపీ యత్నిస్తోందని అనిత మండిపడ్డారు. మరోవైపు, మైకుల కోసం ఇరు పార్టీల మహిళా ఎమ్మెల్యేలు బాహాబాహీకి దిగారు. సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకున్నారు. దీంతో. మీడియా పాయింట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. దీంతో, అక్కడకు మార్షల్స్ చేరుకున్నారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు లేడీ మార్షల్స్ తో పాటు పోలీసులు రంగంలోకి దిగారు. తమ మహిళా ఎమ్మెల్యేలకు రక్షణగా వైకాపా ఎమ్మెల్యేలు రంగంలోకి దిగడంతో పరిస్థితి విషమించింది.
ఒక దశలో మహిళా శాసనసభ్యులు ఒకరిని ఒకరు తోసుకుంటూ, మైకులు లాక్కుంటూ కనిపించారు. తీవ్ర ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నారు. ఆపై మార్షల్స్ సాయంతో వైకాపా ఎమ్మెల్యేలను లాగేశారు. ఆ సమయంలో గిడ్డి ఈశ్వరి తీవ్ర అభ్యంతరం తెలుపుతూ, తమపై కండబలం చూపుతున్నారని, పోలీసులతో కొట్టిస్తున్నారని ఆరోపించారు. "నన్ను తాకొద్దు. నేనేం తప్పు చెయ్యలేదు" అని అరుస్తూ మార్షల్స్ పై విరుచుకుపడ్డారు. వైకాపా సభ్యులను అక్కడి నుంచి మార్షల్స్ తరలించగా, తర్వాత టీడీపీ ఎమ్మెల్యేలు మాట్లాడిన అనంతరం సభ మళ్లీ మొదలైంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more