రాష్ట్రంలో అధికార పార్టీ, ఆరెస్సెస్ ల మధ్య మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి విభేదాలు చేరుకున్నాయి. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకర్తలు వరుసగా హత్యకు గురవుతుండడం వెనక ముఖ్యమంత్రి పినరయి విజయన్ పాత్ర ఉందని, అతని తల తెచ్చిచ్చిన వారికి కోటి రూపాయలు నజరానా ఇస్తానని మధ్యప్రదేశ్కు చెందిన ‘షా ప్రచార్ ప్రముఖ్’ కుందన్ చంద్రావత్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇంతలోనే ఓ ఆరెస్సెస్ కార్యాలయంపై బాంబు దాడి జరగటం పెను కలకలం రేపింది.
నాదపురం సమీపంలోని కలాచీ వద్ద రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆరెస్సెస్) కార్యాలయంపై గురువారం రాత్రి జరిగిన బాంబుదాడిలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన బాబు, వినీష్లను కోజికోడ్ మెడికల్ కాలేజీకి, సుధీర్, సునీల్లను ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. గుర్తుతెలియని వ్యక్తులు ముసుగులో వచ్చి కార్యాలయంపై క్రూడ్ బాంబు విసిరినట్టు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు.
ఇక తన తలపై కోటి రూపాయలు నజరానా ప్రకటనపై పినరయి విజయన్ ఘాటుగా స్పందించారు. ఆర్ఎస్ఎస్ ఇప్పటికే ఎంతో మంది తలలను తీసుకుందని అన్నారు. ఈ బెదిరింపులకు భయపడేది లేదని, తన ప్రయాణాన్ని, తన పనులను తాను చేసుకుపోతానని చెప్పిన విజయన్ నవ్వులు చిందించడం గమనార్హం. కాగా, ఈ వ్యాఖ్యలను సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఖండించారు. సీఎంపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సబబు కాదని ఆయన మండిపడ్డారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more