తమిళనాడు స్వర్గీయ ముఖ్యమంత్రి పురచ్చితలైవి జయలలిత ఆశయాలను ముందుకు తీసుకుపోతామని విశ్వాసపరీక్ష నెగ్గిన అనంతరం ముఖ్యమంత్రి పళనిస్వామి అన్నారు. పార్టీ వ్యవస్థాపకులైన ఎంజీఆర్ సహా అమ్మ ఆశయాలను సాధిస్తాం. అమ్మ సంక్షేమ పథకాలను కొనసాగిస్తాంమని పళని స్వామి ప్రకటించారు. చిన్నమ పేరును కూడా ప్రస్తావించిన పళనిస్వామి.. అమ్మ, చిన్నమ్మల అశీస్సులతోనే తాము విశ్వాస పరీక్షలో నెగ్గగలిగామని అన్నారు. విశ్వాసపరీక్ష గెలిచిన అనంతరం తనకు మద్దుత్తునిచ్చిన ఎమ్మెల్యేలతో నేరుగా మెరినా బీచ్ లోని జయలలిత సమాధి వద్దకు చేరుకుని ఘన నివాళులర్పించారు.
అమ్మ గెలిచిందంటూ నినాదాలతో మెరీనా బీచ్ లోని అమ్మ సమాధి మారుమోగింది. ఈ సందర్భంగా పళనిస్వామి.. అమ్మకు నివాళులర్పిస్తూ పళని స్వామి కన్నీరు పెట్టారు. అమ్మ గెలిచిందంటూ నినాదాలు మిన్నంటాయి. ఆ తరువాత మీడియాతో మాట్లాడిన పళనిస్వామి ఇన్నాళ్లు అమ్మకు విధేయుడిగా పేరొందిన పన్నీరుసెల్వం, ఆయనతో పాటు ఆయన వర్గం అమ్మ జీవితాంతం పోరాడిన డీఎంకేతో ఎలా చేతులు కలిపి ’అమ్మ’ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలా కుట్రలు చేసిందో, పనిచేసిందో ప్రతి ఒక్కరూ వీక్షించారని వ్యాఖ్యానించారు. అన్నా ద్రవడమున్నేట్ర కటగం పార్టీని ఎట్టి పరిస్థితుల్లోనూ చీలిపోనివ్వమని ప్రకటించారు.
పార్టీని ద్రోహులు, అరాచక శక్తుల చేతుల్లోంచి కాపాడుకున్నామని, చిన్నమ్మ శపథం నెరవేరిందంటూ పళని ఆవేశంగా మాట్లాడారు. డీఏంకేతో చేతులు కలిపి పన్నీరు తీవ్ర తప్పు చేశారని విమర్శించారు. అమ్మను అవమానించిన పార్టీతో చేతులు కలపి ద్రోహిగా మారాడని విమర్శించారు. నిజమైన అమ్మ మద్దతు దారులెవరో ఈ రోజు తేలిపోయిందని పళని స్వామి చెప్పారు. సభలో విపక్షాల ప్రవర్తనా తీరు బాధాకరమన్నారు. అంతకుముందు ఆయన మెరీనా బీచ్ లోని అమ్మసమాధిని దర్శించుకుని జయలలితకు నివాళులర్పించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more