నోట్ల రద్దు తర్వాత పసిడి క్రయవిక్రయలపై ఓ కన్నేసి ఉంచిన ఆర్థిక శాఖ మరో నిబంధనను జారీ చేసింది. పెద్ద మొత్తంలో బంగారం లేదా వెండి ఆభరణాలను కొనడానికి వెళ్లాలనుకుంటున్న వారు ఇకపై వారితో పాటు తమ పాన్కార్డ్ లేదా ఆధార్ ను కూడా తీసుకెళ్లాల్సి ఉంటుందని తెలిపింది. 2017 బడ్జెట్ ప్రకటన అనంతరం నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయని సమాచారం.
బంగారు దుకాణాల్లో రూ.50వేల కంటే ఎక్కువ మొత్తం విలువచేసే ఆభరణాలు కొనాలనుకుంటే కంపల్సరీ వాటిని తీసుకెళ్లాల్సిందే. ప్రస్తుతం రూ.2 లక్షల కంటే ఎక్కువకు ఆభరణాలు కొనుగోలు చేసేవారికి మరో విధంగా ఉన్న విషయం తెలిసిందే. వారు బంగారం మార్కెట్లో కేవైసీ కంప్లియన్స్ను సమర్పిస్తున్నారు.
ఆయా మార్కెట్లలో కైవేసీ అవసరాన్ని ప్రస్తుతమున్న రూ.2 లక్షల నుంచి మరింత తగ్గిస్తారని తెలుస్తోంది. ఇకపై రూ.50వేలకు కేవైసీ కంప్లియన్స్ ను తీసుకొస్తారని విశ్లేషకులు అంటున్నారు. డీమానిటైజేషన్ అనంతరం నల్లధన కుబేరులు తమ డబ్బుని పలు రూపాల్లో నిల్వ చేసుకునేందుకు ప్రయత్నాలు జరిపిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంటూ వస్తోన్న విషయం తెలిసిందే.
మరోవైపు ఏటీఎంలలో నగదు విత్ డ్రా పరిమితిని ఫిబ్రవరి ఒకటి నుంచి ఎత్తివేయాలని ఆర్బీఐ నిర్ణయించించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన జారీ చేసింది. బ్యాంకుల్లోనూ పరిమితిని ఆయా శాఖల విచక్షణకే వదిలేసింది. ఇక కరెంట్ అకౌంట్ క్యాష్ క్రెడిట్ అకౌంట్ - ఓవర్ డ్రాఫ్ట్ అకౌంట్ల వారికి పరిమితిని పూర్తిగా ఎత్తివేసింది. ఎల్లుండి నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి.అయితే సేవింగ్స్ బ్యాంకు ఖాతాదారులకు ప్రస్తుతమున్న పరిమితులు యథాతథంగా కొనసాగుతాయని తెలిపింది. భవిష్యత్తుల్లో వీరికి కూడా నిబంధనలు ఎత్తివేయడాన్ని పరిగణలోకి తీసుకుంటామని పేర్కొంది. సేవింగ్స్ బ్యాంకు ఖాతాదారులు ప్రస్తుతం వారానికి రూ.24 డ్రా చేసుకునే అవకాశమే ఉంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more