రైలు ప్రమాదంలో పెరుగుతున్న మృతుల సంఖ్య death toll raises in vizianagaram train tragedy

Death toll raises in vizianagaram train tragedy

Hirakhand Express, Jagdalpur Bhubaneswar Express, Hirakhand Express Accident, Hirakhand Express train derail, vizianagaram train derail, andhra pradesh train tragedy, Train accident, train derailmen

Death toll increasing in the derailment of the Hirakhand Express train in in Andhra Pradesh’s Vizianagaram district, that claimed lives of 34 people

రైలు ప్రమాదంలో పెరుగుతున్న మృతుల సంఖ్య

Posted: 01/22/2017 11:41 AM IST
Death toll raises in vizianagaram train tragedy

విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ అందోళన కలిగిస్తుంది. ఈ ఘటనలో తొలుత 20 మంది మరణించారని అనధికారకంగా తెలియగా, క్రమంగా ఆ సంఖ్య పెరుగుతూ ప్రయాణికులు బంధువులలో తీవ్ర అందోళన రేపుతుంది. ఇప్పటికే ఘటనాస్థలంలో 20 మంది మరణించగా, అస్పత్రికి తరలిస్తున్న సమయంలో మరికోందరు, చికిత్స అందిస్తుండగా ఇంకోందరు మరణించారని తెలుస్తుంది. అయితే నుజ్జునుజ్జయిన రైలు బోగీలలో ఇంకా ఎవరైనా వున్నారా..? అన్నది కూడా అందోళన కల్గిస్తుంది.

కాగా, రైలు ప్రమాదఘటనలో  35 మంది మరణించినట్టు అడిషనల్ డీజీ అనిల్ సక్సేనా మీడియాకు వెల్లడించారు. సహాయక చర్యలు చురుకుగా సాగుతున్నాయని తెలిపారు. మృతుల్లో చినకుదుమ గ్రామానికి చెందిన మిర్యాల కృష్ణ, పాతర్లపల్లి శ్రీను, పాతర్లపల్లి పోలిశెట్టిలను గుర్తించామని చెప్పారు. క్షతగాత్రుల్లో వసంతకుమార్ మహంతి, అశ్రినాయుడు, ఆర్ శ్రీనివాసరావు, ఎస్పీ ఠాకూర్, తేజస్విని, నిరుపమ, ముకుందా కాశి, కల్యాణ్ సింగ్, జ్యోత్సాబాయి, డోలినాయక్, సుర్జిత్ నాయక్, కుమార్ మహంతి, లీసా సాహు, దుర్గాప్రసాద్ పండా, సాయి సుచిత్రా మోహర్, కుమారి పుల్లై తదితరులు ఉన్నారు. మరింత మంది గాయపడిన వారి వివరాలు తెలియాల్సి వుంది. ఘటనలో 50 మందికి పైగా గాయపడగా, వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. వీరిని మెరుగైన చికిత్స కోసం విశాఖకు తరలించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hirakhand Express  Jagdalpur Bhubaneswar Express  Vizianagaram  Andhra Pradesh  

Other Articles