ప్రమాదాల్లో మరణించిన వారికి వాళ్ల వాళ్ల ఇన్సూరెన్స్ పాలసీల ద్వారా డబ్బులు రావటం అనేది తెలిసిందే. అయితే ఇక్కడ దొమకాటును ద్వారా మనిషి చనిపోతే అది కూడా యాక్సిడెంట్ కిందకే వస్తుందని ఓ సంచలన ఆదేశాలు జారీ చేసింది జాతీయ వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్. దోమ కాటు కూడా ప్రమాదం(అనుకోకుండా జరిగేదే కాబట్టి) కిందికే వస్తుందని, కావున దోమ కాటు కారణంగా మరణించిన వారికి బీమా సొమ్ము చెల్లించాల్సిందేనని తేల్చి చెప్పింది.
పశ్చిమ బెంగాల్కు చెందిన మౌసమీ భట్టాచార్జీ అనే మహిళ భర్త దేవాశిష్ 2012లో దోమకాటుతో మలేరియా వచ్చి చనిపోయాడు. దీంతో ఆమె కేసు నమోదు చేయగా, విచారణ సందర్భంగా వినియోగదారుల కమిషన్ ఈ తీర్పు చెప్పింది.‘‘దోమ మనకు చెప్పి కుట్టదు కాబట్టి, దానిని అకస్మాత్తుగా జరిగిన ప్రమాదంగానే భావించాలని పేర్కొంది. దోమకాటు మరణాలను ప్రమాదవశాత్తు జరిగిన మృతిగా అంగీకరించడం కొంచెం కష్టమైన పనే అయినా దోమ కుడుతుందని ఎవరూ ముందుగా ఊహించరు కాబట్టి అది ప్రమాదం కిందికే వస్తుంది’’ అని తేల్చి చెప్పింది. కావున ఆ మరణాలకు బీమా సొమ్ము చెల్లించాల్సిందేనని పేర్కొంది.
బీమా కంపెనీలు తమ వెబ్సైట్లలో కుక్కకాటు, గడ్డకట్టే చలికి చనిపోవడం వంటి వాటిని మాత్రమే ప్రమాదాలుగా పేర్కొన్నాయని, కానీ దోమకాటు కారణంగా వచ్చే మలేరియాను వ్యాధిగానే పరిగణిస్తున్నాయని పేర్కొంది. ఇక నుంచి దీనిని కూడా ప్రమాదంగానే పరిగణించాలని, బీమా సొమ్మును చెల్లించాలని జస్టిస్ వీకే జైన్ ఆదేశించారు. గతంలో వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించగా 2014 ఫిబ్రవరిలో అనుకూలంగా తీర్పు వచ్చింది. తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీ రాష్ట్ర ఫోరాన్ని ఆశ్రయించగా వ్యాజ్యాన్ని కొట్టివేసింది. దీంతో కంపెనీ జాతీయ కమిషన్కు దరఖాస్తు చేసుకుని చివరకు విజయం సాధించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more