నోట్ల రద్దు విషయంలో కేంద్ర ప్రభుత్వం మరో షాకింగ్ నిర్ణయం తీసుకోనుందా?. డిసెంబర్ 30 తర్వాత పెద్ద ఎత్తున్న పాత నోట్లు ఉన్నవాళ్లకి కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తబోతున్నాయా? ఆర్థిక శాఖ అవుననే అంటోంది. త్వరలో తీసుకురానున్న కొత్త ఆర్డినెన్స్ ప్రకారం రద్దయిన రూ.500 , రూ.1000 రూపాయిల నోట్లు ఎవరివద్దయినా రూ.10,000లకు పైగా ఉంటే దానిని క్రిమినల్ నేరంగా పరిగణించనున్నారు.
రద్దయిన పెద్దనోట్లతో పట్టుబడిన వారికి రూ.50 వేల జరిమానా లేదా పట్టుబడిన సొమ్ముకు అయిదు రెట్లు జరిమానా వేయనున్నారు. అంతేగాక, ఈ నేరానికి పాల్పడితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో పురపాలక మేజిస్ట్రేట్ ఆధ్వర్యంలో విచారణ జరిపించి, జరిమానాను కూడా విధించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది.
నవంబరు 8కి ముందు దేశంలో మొత్తం రూ. 15.44 లక్షల కోట్ల పెద్దనోట్లు చలామణీలో ఉన్న విషయం తెలిసిందే. వాటిలో ఈ నెల 13 వరకు 12.44 లక్షల కోట్లు జమ అయినట్టు ఆర్బీఐ తెలిపింది. ఈ నెల 30 గడువు లోపు బ్యాంకుల్లో రూ.13 లక్షల నుంచి 13.5 లక్షల కోట్లు డిపాజిట్ అవుతుందని భావిస్తున్నారు. ఈ నెల 30 తరువాత రద్దయిన నోట్లను రిజర్వ్ బ్యాంక్ కౌంటర్లలో జమ చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన గ్రేస్ పీరియడ్ ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించనుంది. ఈ నెల 30లోపే ఈ ఉత్తర్వులను జారీ చేయాలని కేంద్ర సర్కారు భావిస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more