భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న ప్రత్యేక ఎయిర్ ఫోర్స్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. గాలితో వుండగా ఈ లోపం తలెత్తిడంతో వెంటనే గుర్తించిన ఎయిర్ ఫోర్స్ అధికారులు దానిని హుటాహుటిన ఢిల్లీకి తరలించారు. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు కడసారి నివాళులు అర్పించేందుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆర్మీకి చెందిన ప్రత్యేక విమానంలో చెన్నై బయల్దేరారు. రాజాజీ హాలులో వుంచిన అమ్మకు శ్రద్దాంజలి ఘటించేందకు వస్తున్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
విమానం చెన్నైకి చేరుకుంటున్న క్రమంలో సాంకేతిక లోపం తలెత్తింది. సాంకేతిక లోపాన్ని గుర్తించిన ఫైలెట్ విమానాన్ని చెన్నై విమానాశ్రయంలో దిగకుండానే ఆ విమానం తిరిగి ఢిల్లీకి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ఇక జయలలితకు ప్రత్యక్షంగా నివాళులు అర్పించే వీలు ఉంటుందో లేదో అన్నది అనుమానంగానే మారిపో్యింది. కాగా, ఆయన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అకాలమృతిపై తనను దు:ఖసాగరంలో ముంచిందన్నారు.
తనకు జయలలిత చాలా కాలం నుంచి తెలుసునని, తాను పార్లమెంటు పక్ష నేతగా వున్నప్పుడు అమె తొలిసారగా సభలోకి అడుగుపెట్టారని కూడా ఆయన గుర్తుచేసుకున్నారు. అమెతో తాను వివిధ సందర్భాలలో అనేక అంశాలపై చర్చించానని కూడా తెలిపారు. అమ్మ తనకు ఎదురైన అనేక వివాదాలను దీక్షా పటుట్దలతో ఎదర్కోని విజాయాన్ని సాధించారని అన్నారు. అమె తన జీవిత చరమాంకం వరకు అన్నింటినీలో పోరాడుతూనే వున్నారని అన్నారు. మరోవైపు తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతికి సంతాపాన్ని సమర్పించిన తరువాత పార్లమెంటు ఉభయ సభలు ఇవాళ్టికి వాయిదా పడ్డాయి.
కాగా, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తిరిగి చెన్నై బయలుదేరారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఢిల్లీ విమానాశ్రయానికి తిరిగి వెళ్లిన ఆయన.. మళ్లీ , చెన్నైకి పయనమయ్యారు. సాంకేతిక సమస్యను సరిదిద్దిన అనంతరం రాష్ట్రపతి.. అదే విమానంలో తిరిగి చెన్నైకి బయలుదేరారు. కాగా, ఆయన ఇవాళ చెన్నైలోని మెరినా బీచ్లో జరిగే తమిళనాడు సీఎం జయలలిత అంత్యక్రియల్లో పాల్గొననున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more