దేశం నుంచి అవినీతి, అక్రమ డబ్బు, నల్లధనం, ఉగ్రవాదం, అంతర్గత తీవ్రవాదం తదితరాలన్నింటినీ ఒకే దెబ్బతో రూపుమాపగలమని భావించిన కేంద్రం పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అత్యధికంగా సామాన్య, మధ్యతరగతి ప్రజలు అధికంగా ఇబ్బందులను ఎదుర్కోంటున్నారు. ఈ తరుణంలో రెండు రోజుల క్రితం పెద్ద నోట్ల రద్దును దేశ ప్రజలందరూ స్వాగతిస్తున్నారని చెప్పుకోచ్చారు. కొత్త యాప్ ద్వారా దేశప్రజలు తమ అభిప్రాయాలను తెలుపగా, సుమారు ఐదు లక్షల మందిలో 92 శాతం మంది ఇది మంచి నిర్ణయమని అభిప్రాయపడినట్లు చెప్పారు.
నరేంద్రమోడీ ప్రకటనపై స్వయంగా అ పార్టీకి చెందిన ఎంపీ, సీనీనటుడు, షాట్ గన్ గా పేరొందిన శత్రుఘ్నన్ సిన్హా పిచ్చోళ్ల స్వర్గంలో విహరించడం అపాలని.. ఇప్పటికైనా ప్రజలు అనుభవిస్తున్న కష్టాలను భ్రమల ప్రపంచంలోంచి బయటకు వచ్చి చూడాలని దుయ్యబట్టారు. అంతకు ముందు దేశ సర్వోన్నత న్యాయస్థానం కూడా పెద్ద నోట్ల రద్దుపై దాఖలైన కేసులను కొట్టివేయాలన్న ప్రభుత్వ వినతిని తోసిపుచ్చుతూ.. ఈ అంశంలో అల్లర్లు కూడా జరగవచ్చని అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
వీటిని కేంద్రం పరిగణలోకి తీసుకుని వుంటే బాగుండేదని తాజాగా పార్లమెంటు సాక్షిగా వెలుగుచూసిన ఘటనతో స్పష్టం అవుతుంది. ఉత్తర్ ప్రదేశ్ బలంద్ షహర్ కు చెందిన బీజేపి ఎంపీ బోలా సింగ్ బాజ్ పాయ్ ముఖ్య అనుచరులలో ఒకరైన రాకేష్ సింగ్ బకేల్ అనే బీజేపి కార్యకర్త ఆయనతో పాటుగా పార్లమెంటుకు వచ్చి.. అక్కడ విజిటర్స్ గాలరీలోకి వెళ్లి సమావేశాలను తిలకించాడు. లోకసభను స్పీకర్ సుమిత్రా మహాజన్ వాయిదా వేయగానే పార్టీ కార్యకర్త ఉన్నఫలంగా విజిటర్స్ గాలరీ నుంచి లోక్ సభలోకి దూకుందుకు యత్నించాడు.
ఈ ప్రయతాన్ని అక్కడ వున్న పార్లమెంటు సెక్యూరిటీ సిబ్బంది అడుకున్నారు. అతని కాలు అక్కడున్న బారికేడ్ లో ఇరుక్కుపోయింది. అతన్ని అదుపులో తీసుకునేలోపు బీజేపి కార్యకర్తగా వుంటూనే అతను ప్రధాని నరేంద్రమోడీకి వ్యతిరేకంగా లోక్ సభలో గళం విప్పాడు. ప్రధానికి వ్యతిరేక నినాదాలు చేశాడు. నోట్ల రద్దు విషయంలో ప్రధాని తీసుకన్న నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాడు. నోట్ల రద్దు విషయంలో ప్రజల్లో వున్న వ్యతిరేకతను ఇప్పటికైనా ప్రధాని గుర్తించాలని విపక్షాలు సూచించాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more