వారం నుంచి దేశ ప్రజలకు కంటి మీద కునుకు లేదు. ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం ఏటీఎంల ముందు, బ్యాంకుల ముందు బారులు తీరుతున్న సీన్లు దర్శనమిస్తున్నాయి. స్వాగతించే నిర్ణయం అయినప్పటికీ, చిల్లర చిక్కులు ఇంకా వీడటం లేదు. 500 నోట్లు ఇంకా చాలా చోట్ల అందుబాటులోకి రాకపోవటం, ఇస్తున్న 2000 నోట్లకి చిల్లర ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రాకపోవటంతో కరెన్సీ కష్టాలు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి.
ఇదిలా ఉంటే పూర్తిగా వంద నోట్లతోనే కాస్త ఊరట కలిగిస్తున్న ఎస్బీఐ మరో శుభవార్త అందజేసింది. ఎస్బీఐ ఏటీఎంల నుంచి రూ.2000, రూ.500, రూ.100 నోట్లే కాదు.. రూ.20, రూ.50 నోట్లు కూడా తీసుకోవచ్చు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఎస్బీఐ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు సంస్థ చైర్ పర్సన్ అరుంధతీ భట్టాచార్య ఓ ప్రకటనలో తెలిపారు.
ఎస్బీఐ ఏటీఎంలలో రూ.20, రూ.50 నోట్లు కూడా ప్రవేశపెడతామని, అయితే ఇందుకు కొంత సమయం పడుతుందని ఆమె వివరించారు. ఇప్పటి వరకు ఇంత తక్కువ విలువైన కరెన్సీని ఏటీఎంలలో పెట్టలేదని పేర్కొన్నారు. చిన్న నోట్లు దొరక్క ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. వీలైనంత త్వరగా చిన్న నోట్లను ఏటీఎంలలో ఉంచాలని భావిస్తున్న సంస్థ ఏటీఎంల వద్ద రద్దీ తగ్గిన వెంటనే ఈ విధానాన్ని అమలు చేయాలని భావిస్తోంది.
ఇక ఏటీఎంల ద్వారా జరిపే లావాదేవీలపై డిసెంబరు 30 వరకు ఎటువంటి చార్జీలను వసూలు చేసేది లేదని ఆర్బీఐ ప్రకటించింది. అయితే ఇది సేవింగ్స్ ఖాతాదారులకు మాత్రమే వర్తిస్తుందని, డెబిట్ కార్డులపై ఉన్న పరిమితిని ఎత్తివేస్తున్నట్టు తెలిపింది. తమ బ్యాంకులతోపాటు ఇతర బ్యాంకుల్లో నెలలో ఎన్నిసార్లు అయినా లావాదేవీలు చేసుకోవచ్చని, పరిమితి లేదని, చార్జీలు వసూలు చేయబోమని ప్రకటించింది.
ప్రస్తుతం సొంతబ్యాంకు ఏటీఎం నుంచి నెలకు ఐదుసార్లు, ఆరు మెట్రో నగరాల్లో ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి నెలకు మూడుసార్లు మాత్రమే ఉచితంగా లావాదేవీలు జరుపుకునే అవకాశం ఉంది. ఈ పరిమితి దాటితే ప్రతి లావాదేవీకి నెలకు రూ.20 చొప్పున వసూలు చేస్తారు. ప్రస్తుతం పెద్ద నోట్లు రద్దు చేయడం, కొత్త నోట్లు పొందడానికి పరిమితులు విధించడంతో డెబిట్ కార్డును పలుమార్లు ఉపయోగించాల్సిన పరిస్థితి తలెత్తింది. దీనిని దృష్టిలో పెట్టుకున్న రిజర్వ్ బ్యాంకు డెబిట్ కార్డు వినియోగంపై ఉన్న ఆంక్షలను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది.
ఫ్రీ పార్కింగ్...
ప్రజల చిల్లర ఇక్కట్లను గుర్తించిన కేంద్రం ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా పాత నోట్ల గడుపు మరో పదిరోజులు పెంచిన విషయం తెలిసిందే. అంతేకాదు టోల్ టాక్స్ రద్దును మరికొన్ని రోజులపాటు పొడిగించింది కూడా. ఇక ఇప్పుడు విమానాశ్రయాల వద్ద పార్కింగ్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వారం రోజుల పాటు అంటే వచ్చే సోమవారం (నవంబర్ 21) వరకు దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఎలాంటి పార్కింగ్ వసూలు చేయరని ప్రకటించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more