పర్యాటక జట్టు ఇంగ్లండ్ తో రాజ్ కోట్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో టీమిండియా వెనుకబడింది. పర్యటక జట్టు సాధించిన స్కోరును బ్యాటింగ్ ప్రారంభించిన తొలి రోజు ధీటుగా బదులిచ్చిన భారత్.. ఇవాళ క్రమంగా వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. రాజ్ కోట్ టెస్టు తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 488 పరుగులకు ఆలౌటైంది. 319/4 ఓవర్ నైట్ స్కోరుతో నాల్గో రోజు ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ మరో 169 పరుగులను జత చేసిన మిగతా ఆరు వికెట్లను కోల్పోయింది.
మిడిల్ అర్డర్ లో ధీటైన బ్యాట్స్ మెన్లగా పేరొందిన అజింక్యా రహానే(13), కోప్టెన్ విరాట్ కోహ్లీలు త్వరగా పెవీలియన్ చేరడంతో భారత్ ఒడ్డున పడేందుకు ప్రయాసపడింది. ఐదో వికెట్ గా అవుటయ్యాక, కాసేపటికి విరాట్ కోహ్లి(40) పెవిలియన్ చేరాడు. దాంతో భారత్ 361 పరుగుల వద్ద ఆరో వికెట్ ను నష్టపోయింది. ఆ సమయంలో క్రీజ్ లోకి వచ్చిన రవిచంద్రన్ అశ్విన్, వృద్దిమాన్ సాహాలు నిలకడగా అడి సోర్కు బోర్డును పరుగులెత్తించారు. ఈ క్రమంలో వృద్దిమాన్ సాహ 35 పరుగుల వద్ద వెనుదిరగేందుకు ముందు వీరద్దరి కలసి భారత్ ఏడో వికెట్ కు 63 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు.
కాగా, అశ్విన్ మాత్రం అలానే క్రీజ్ను అంటిపెట్టుకుని టెయిలెండర్లతో స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. అదే క్రమంలో అతని టెస్టు కెరీర్లో ఏడో హాఫ్ సెంచరీ సాధించాడు. చివరి వికెట్ గా అవుట్ అయిన అశ్విన్.. 138 బంతుల్లో 7పోర్ల సాయంతో 70 పరుగులు సాధించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో రషీద్ నాలుగు వికెట్లు సాధించగా, అన్సారీ, మొయిన్ అలీలు రెండేసి వికెట్లు తీశారు.స్టువర్ట్ బ్రాడ్, బెన్ స్టోక్స్లకు తలో వికెట్ దక్కింది. అంతకుముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 537 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. దాంతో ఇంగ్లండ్ కు 49 పరుగుల ఆధిక్యం లభించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more