సెల్ ఫోన్ నుంచి వచ్చిన ఓ మెసేజ్ రెండు ఊర్ల మధ్య చిచ్చు రగిల్చటంతో ఏడుగురి తలలు పగిలాయి. ఓ అమ్మాయి పంపిన ఐ లవ్ య్యూ అనే సందేశం కావటం ఇంకో ఎత్తు. తన పొరుగింట్లో ఉన్న మహిళ మొబైల్ను తీసుకొని పంపిన మెసేజ్తో రెండు గ్రామాల ప్రజలు కొట్టుకున్న ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.
విల్లిపురానికి చెందిన ఓ పదిహేనేళ్ల అమ్మాయి తమ ఇంటి ముందు నివసిస్తోన్న ఓ మహిళకు చెందిన ఫోనును తీసుకుంది. తన బంధువయిన 20 ఏళ్ల గోపీనాథ్కు ఆ అమ్మాయి ‘ఐ లవ్ యూ’ అని మెసేజ్ పంపించింది. తనకు వచ్చిన ఆ ఎస్ఎమ్ఎస్కు గోపీనాథ్ స్పందిస్తూ కాసేపటి తరువాత అదే నెంబరుకి ఫోన్ చేశాడు. ఫోన్ ఎత్తిన మహిళ ఆ మెసేజ్ తన మొబైల్ నుంచి వచ్చిందే కానీ, అలా ఎవరు పంపించారో మాత్రం తనకు తెలియదని పేర్కొంది. అయినప్పటికీ గోపీనాథ్ వినిపించుకోకుండా పలుసార్లు ఫోన్ చేశాడు. చివరికి ఆ మహిళ గట్టిగా మాట్లాడి మరోసారి ఫోన్ చేయొద్దని చెప్పింది.
అయితే, గోపీనాథ్ ఆ మహిళతో అసభ్యకరంగా మాట్లాడాడు. దీంతో ఆ మహిళ తన సమీప బంధువు అయ్యప్పన్ (18)కు ఈ విషయాన్ని తెలిపింది. స్పందించిన అయ్యప్పన్ గోపీనాథ్ను హెచ్చరించాడు. అయినా గోపీనాథ్ వినిపించుకోలేదు. ఆగ్రహం తెచ్చుకున్న అయ్యప్పన్ తన నలుగురు మిత్రులను తీసుకుని గోపీనాథ్ ఉంటున్న మున్నియన్పెట్టయ్కి వెళ్లి గొడవకు దిగాడు. గొడవకు దిగిన వారికి స్థానిక పెద్దలు నచ్చజెప్పారు. అయినా వారు వినిపించుకోకుండా, గోపీనాథ్కు తాము బుద్ధి చెప్పి మరోసారి ఇలా చేయకుండా చూస్తామని చెప్పారు. దీంతో గోపీనాథ్ తనకు అవమానం కలిగిందని భావించి, తన ఐదుగురు మిత్రులతో కలిసి అయ్యప్పన్ స్నేహితులను తరిమాడు. దీంతో ఇరు వర్గాలు కర్రలు, రాళ్లతో గొడవకు దిగి కొట్టుకున్నారు. అయ్యప్పన్కు గాయాలు కావడంతో పాండిచేరిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స కు తరలించారు.
అతడికి గాయాలయ్యాయని తెలుసుకున్న అతని గ్రామస్తులు 10 మంది మున్నియన్పెట్టయ్ తరలివెళ్లి గోపీనాథ్పై దాడికి దిగారు. అయితే, తమ గ్రామస్తుడిపై దాడికి వచ్చిన విషయం తెలుసుకున్న మున్నియన్ పెట్టయ్ వాసులు గోపీకి మద్ధతుగా నిలిచి, గొడవకు దిగారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఎటువంటి ఉద్రిక్తత చోటుచేసుకోకుండా ఇరు గ్రామాల వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more