అంతా ఉన్న అనాథ శవంలా ఇడ్చుకుంటూ... | Family drags adivasi woman's body to crematorium in Odisha.

Family drags adivasi woman s body to crematorium in odisha

Family drags adivasi woman's body, Odisha Family drags adivasi woman's body, Shunned by community woman's body dragged, Family drags adivasi woman's body to crematorium, another Dead Body shocker in Odisha, Woman dead body dragged by cot

Family drags adivasi woman's body to crematorium in Odisha who Shunned by community over inter cast marriage.

మహిళ శవాన్ని మంచానికి కట్టి ఈడ్చుకుంటూ...

Posted: 10/28/2016 08:09 AM IST
Family drags adivasi woman s body to crematorium in odisha

ప్రేమించి వేరే కుల వ్యక్తిని వివాహం చేసుకుంది. ఫలితం ఊరి పెద్దలంతా ఆ జంటను, ఆమె కుటుంబాన్ని వెలేశారు. అయినా ప్రశాంతంగా జీవిస్తున్న ఆ మహిళ జీవితంలో ఒక్కసారిగా అలజడి. భర్త ఆనారోగ్యంతో కన్నుమూశాడు. ఆ దిగులుతో మంచం పట్టిన ఆమె కూడా తనువు చాలించింది. అంత్యక్రియలకు ఆ కుటుంబం దగ్గర డబ్బులు లేవు. చనిపోయింది కదా ఇప్పుడైనా కనికరిస్తారేమో అని వారు గ్రామపెద్దలను వేడుకున్నారు. కానీ, వారి రచ్చ బండ హృదయాలు కరగలేదు. ఫలితం... ఇదిగో ఇలా...

ఒడిశాలో చోటుచేసుకున్న అత్యంత మానవీయమైన ఘటన వివరాళ్లోకి వెళ్లితే... అత్యంత వెనుకబడిన గిరిజన ప్రాంతమైన కలహందీ లోని కోక్సారా బ్లాక్ లోని మహిమా పంచాయత్ లో సావిత్రి జువాయిడ్ అనే మహిళ మృతిచెందింది. ఆమె ఖననానికి డబ్బులు లేకపోవటంతో వెదురు బొంగులకు కట్టి ఇలా ఇడ్చుకెళ్తున్నారు. సవర కులానికి చెందిన సావిత్రి, గౌడ కులానికి చెందిన వ్యక్తిని కులాంతర ప్రేమ వివాహం చేసుకుంది. వారిద్దరూ అన్యోన్యంగా ఉండేవారు. కొన్ని నెలల క్రితం ఆమె భర్త మృతి చెందాడు. ఆ తర్వాత అనారోగ్యం బారినపడ్డ సావిత్రి కూడా మంగళవారం మృతి చెందింది.

ఆర్థిక స్తోమత లేకపోవడంతో ఆమె అంత్యక్రియలకు సహాయం చేయాలని గ్రామస్థులను ఆమె కుటుంబ సభ్యులు కోరారు. అయితే, ఎవరూ ముందుకు రాకపోవడంతో, మంచానికి రెండు పొడవాటి వెదురు బొంగులు కట్టి ఆ మంచంపై ఆమె మృతదేహాన్ని పెట్టి, ఈడ్చుకుంటూ వెళ్లి ఖననం చేశారు. దీనిని చూసిన కొంత మంది జిల్లా కలెక్టర్ దృష్టికి చేరవేశారు. వెంటనే స్పందించిన ఆయన ఇతర కార్యక్రమాలు పూర్తిచేయాలని ఆదేశిస్తూ, హరిశ్చంద్ర సహాయత పథకం కింద 2000 రూపాయలు మంజూరు చేసి బీడీవో అధికారులతో పంపించారు.

కాగా, రెండు నెలల క్రిందట ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మహిళ మృతిచెందగా, అంత్యక్రియల నిమిత్తం ఆమె భర్త ధన మాంజీ ఆమె మృతదేహాన్ని భుజాన మోసుకుంటూ స్వగ్రామానికి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే రాష్ట్రంలో మరోసారి మానవత్వం మంటగలిసేలా మరోఘటన చోటుచేసుకోవటం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Odisha  adivasi woman's body  dragged cot  crematorium  

Other Articles