ప్రేమించి వేరే కుల వ్యక్తిని వివాహం చేసుకుంది. ఫలితం ఊరి పెద్దలంతా ఆ జంటను, ఆమె కుటుంబాన్ని వెలేశారు. అయినా ప్రశాంతంగా జీవిస్తున్న ఆ మహిళ జీవితంలో ఒక్కసారిగా అలజడి. భర్త ఆనారోగ్యంతో కన్నుమూశాడు. ఆ దిగులుతో మంచం పట్టిన ఆమె కూడా తనువు చాలించింది. అంత్యక్రియలకు ఆ కుటుంబం దగ్గర డబ్బులు లేవు. చనిపోయింది కదా ఇప్పుడైనా కనికరిస్తారేమో అని వారు గ్రామపెద్దలను వేడుకున్నారు. కానీ, వారి రచ్చ బండ హృదయాలు కరగలేదు. ఫలితం... ఇదిగో ఇలా...
ఒడిశాలో చోటుచేసుకున్న అత్యంత మానవీయమైన ఘటన వివరాళ్లోకి వెళ్లితే... అత్యంత వెనుకబడిన గిరిజన ప్రాంతమైన కలహందీ లోని కోక్సారా బ్లాక్ లోని మహిమా పంచాయత్ లో సావిత్రి జువాయిడ్ అనే మహిళ మృతిచెందింది. ఆమె ఖననానికి డబ్బులు లేకపోవటంతో వెదురు బొంగులకు కట్టి ఇలా ఇడ్చుకెళ్తున్నారు. సవర కులానికి చెందిన సావిత్రి, గౌడ కులానికి చెందిన వ్యక్తిని కులాంతర ప్రేమ వివాహం చేసుకుంది. వారిద్దరూ అన్యోన్యంగా ఉండేవారు. కొన్ని నెలల క్రితం ఆమె భర్త మృతి చెందాడు. ఆ తర్వాత అనారోగ్యం బారినపడ్డ సావిత్రి కూడా మంగళవారం మృతి చెందింది.
ఆర్థిక స్తోమత లేకపోవడంతో ఆమె అంత్యక్రియలకు సహాయం చేయాలని గ్రామస్థులను ఆమె కుటుంబ సభ్యులు కోరారు. అయితే, ఎవరూ ముందుకు రాకపోవడంతో, మంచానికి రెండు పొడవాటి వెదురు బొంగులు కట్టి ఆ మంచంపై ఆమె మృతదేహాన్ని పెట్టి, ఈడ్చుకుంటూ వెళ్లి ఖననం చేశారు. దీనిని చూసిన కొంత మంది జిల్లా కలెక్టర్ దృష్టికి చేరవేశారు. వెంటనే స్పందించిన ఆయన ఇతర కార్యక్రమాలు పూర్తిచేయాలని ఆదేశిస్తూ, హరిశ్చంద్ర సహాయత పథకం కింద 2000 రూపాయలు మంజూరు చేసి బీడీవో అధికారులతో పంపించారు.
కాగా, రెండు నెలల క్రిందట ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మహిళ మృతిచెందగా, అంత్యక్రియల నిమిత్తం ఆమె భర్త ధన మాంజీ ఆమె మృతదేహాన్ని భుజాన మోసుకుంటూ స్వగ్రామానికి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే రాష్ట్రంలో మరోసారి మానవత్వం మంటగలిసేలా మరోఘటన చోటుచేసుకోవటం విశేషం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more