మరో పొలిటికల్ బండి పట్టాలు తప్పింది. టీడీపీ సీనియర్ నేత, ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి, ముఠా పనిచేసే వ్యక్తిని ఢీ కొట్టింది. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడ్డ అతన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గుంటూరు, నందివెలుగు రోడ్డులోని బాలాజీనగర్ లో నివసించే అన్నం గరటయ్య (27) బీఏటీ పొగాకు కంపెనీలో ముఠా పనిచేస్తుంటాడు. దాణా తెచ్చేందుకు ద్విచక్రవాహనంపై తక్కెళ్ల పాడు బయలుదేరాడు.
అయితే, అటు వైపు నుంచి వస్తున్న రాజకుమారి ప్రయాణిస్తున్న ఇన్నోవా వాహనం, ఆటోను ఓవర్ టేక్ చేసే క్రమంలో అదుపుతప్పి, గరటయ్య ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టింది. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడ్డ గరటయ్యను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి స్థానికులు తరలించారు. అయితే, పీజీ వైద్య విద్యార్థులే గరటయ్యకు వైద్య సేవలందించారు. ప్రత్యేక విభాగం వైద్యులు ఎవరూ పట్టించుకోకపోవడంతో బాధితుడి బంధువులు ఆందోళనకు దిగారు.
అయితే, ఆసుపత్రి వైద్యులతో టీడీపీ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చర్చించిన అనంతరం, బాధితుడిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ సంఘటనపై నన్నపనేని రాజకుమారి స్పందించలేదని బాధితుడి బంధువులు ఆరోపిస్తున్నారు. అయితే ఘటన జరిగిన ప్రదేశంలోనే గరటయ్యకు తీవ్ర రక్తస్రావం కావడంతో చూసిన నన్నపనేని లో బీపీతో స్పృహ కోల్పోయారని, ఆమెను మరో ఆస్పత్రికి తీసుకెళ్లారని ఆమె భద్రతా సిబ్బంది చెబుతుండటం విశేషం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more