కవ్వింపు కాల్పులకు భారత జవాన్ల ధీటైన జవాబు.. 7 Pak Rangers, 1 terrorist killed in retaliatory firing at Jammu border

7 pak rangers 1 terrorist killed in retaliatory firing at jammu border

Pakistani rangers, Indian Army, Border Security Force, Gurnam Singh, Bobiyan village, Hira Nagar Sector, Jammu

The strong response by BSF came after one of Constables Gurnam Singh was injured in a sniper fire attack by Pak Rangers.

కవ్వింపు కాల్పులకు భారత జవాన్ల ధీటైన జవాబు..

Posted: 10/21/2016 09:54 PM IST
7 pak rangers 1 terrorist killed in retaliatory firing at jammu border

అనునిత్యం భారత్ సరిహద్దులో కాల్పుల ఉల్లంఘనలకు పాల్పడూన్న దాయాధి పాకిస్థాన్ కు భారతీయ జవాన్లు ధీటైన జవానునిచ్చారు. పదే పదే సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ.. వారిని అక్రమంగా భారత్ లోకి చోచ్చుకోచ్చేందకు సహకరిస్తున్న పాకిస్థాన్ రేంజర్లకు మన జవాన్లు బుద్ది చెప్పారు. జమ్మూకశ్మీర్ హిరానగర్ సెక్టార్‌లోని బోబియా పోస్ట్‌పై పాక్ కవ్వింపు కాల్పులకు పాల్పడింది. దీంతో భారత ఆర్మీ ప్రతిగా జరిపిన కాల్పుల్లో ఏడుగురు పాక్ రేంజర్లు, ఒక ఉగ్రవాది మృతి చెందారు. ఓ భారత సైనికుడు కూడా గాయపడ్డాడు.
 
ఈ ప్రాంతంలో గత 15 గంటలుగా భారత్, పాక్ మధ్య కాల్పులు జరుగుతున్నాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర శిబిరాలపై భారత ఆర్మీ చేపట్టిన సర్జికల్ స్ట్రైక్స్ నాటి నుంచి పాకిస్థాన్ 32 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. అయితే పాకిస్థాన్ మీడియా మాత్రం ఐదుగురు రేంజర్లు మరణించారని వెల్లడించిన నేపథ్యంలో భారత అర్మీ మాత్రం ఏడుగురు రేంజర్లతో పాటు మరో ఉగ్రవాది కూడా భారత ప్రతిదాడుల్లో మరణించారని తెలిపింది

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles