దేశం అర్థికంగా అభివృద్ది సాధించడానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు చేపట్టిన సరళీకృత ఆర్థిక విధానాలే కారణమని రిజర్వ్ బ్యాంకు మాజీ గవర్నర్ సి.రంగరాజన్ అన్నారు. ఆయన హయాంలో కేంద్ర అర్థిక శాఖామంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన మన్మోహన్ సింగ్ తీసుకోచ్చిన అర్ధికవిధానాలపై ఆయనను అందరూ ప్రశంసిస్తారని, అయితే అందుకు కారణమైన పివీ నరసింహారావును మాత్రం దేశప్రజలు మర్చిపోయారని అన్నారు. ప్రస్తుతం భారతదేశం ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదగబోతోందని, రెండంకెల ఆర్థికాభివృద్ధి సాధించడానికి కారణం పివీ నరసింహారావు తీసుకున్న విధానాలే కారణమని ఆయన అన్నారు.
ప్రధానిగా పీవీ నరసింహారావు దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించిన తీరుపై ప్రముఖ పాత్రికేయుడు సంజయబారు రాసిన ‘1991 హౌ పీవీ నరసింహారావు మేడ్ హిస్టరీ’ పుస్తకంపై జరిగిన చర్చాగోష్టి కార్యక్రమానికి హజరైన ఆయన.. పివీ దేశానికి అర్థిక సంస్కరణలు అందించిన మహా సంస్కర్త అని కోనియాడారు. సంకీర్ణ ప్రభుత్వంలో తన సొంత పార్టీకి చెందిన నేతలే ఆయన నిర్ణయాలను వ్యతిరేకించిన తరుణంలో.. తన నిర్ణయాలను నిద్వందంగా అమలు చేయడానికి తీసుకోవాల్సిన అన్ని చర్యలను తీసుకుని పీవీ సాహసం చేశాడుని, అందుకే ఆయన అర్థిక సరళీకృత విధానాల అర్టిటెక్ట్ అని రంగరాజన్ పెర్కోన్నారు.
ఆర్థిక సంస్కరణలు చేపట్టే అవకాశం అప్పటి ప్రధాని చంద్రశేఖర్కు వచ్చినప్పటికీ ఆయన ధైర్యం చేయలేకపోయారన్నారు. దేశాన్ని ఆర్థికంగా పటిష్టం చేసిన హీరో పీవీయేనని కొనియాడారు. ఆర్థిక సంస్కరణలతోపాటు నెహ్రూ విదేశీ విధానాన్ని పీవీ పూర్తిగా మార్చేశారన్నారు. ఆర్థికాభివృద్ధిని, గ్రామీణాభివృద్ధిని ఏక కాలంలో సాధించే ద్విముఖ వ్యూహాన్ని పీవీ అవలంబించారని తెలిపారు. దేశ ఆర్థిక రంగం ముఖచిత్రాన్ని పీవీ సమూలంగా మార్చేశారని పుస్తక రచయిత సంజయ్బారు అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more