ఉగ్రవాదుల విషయంలో పాకిస్థాన్ లో అంతర్గత కుమ్ములాట మొదలైందా? ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్, ఆర్మీకి అంతర్గత విభేధాలు తలెత్తాయి. అవునంటున్నాయి పాక్ మీడియా చానెళ్లు. వారి మధ్య విభేదాలు తలెత్తినట్టు ఆ దేశానికి చెందిన ప్రముఖ పత్రిక ‘డాన్’ ఓ వార్తను ప్రచురించింది. దాని కథనం ప్రకారం... ప్రధాని షరీఫ్, సైనికాధికారులు, ప్రజాప్రతినిధులు, ఐఎస్ఐ చీఫ్ రిజ్వాన్ అఖ్తర్ల మధ్య ఇటీవల ఉన్నతస్థాయి సమావేశం ఒకటి జరిగింది. ఈ సమావేశంలో తీవ్రస్థాయిలో వాదోపవాదాలు జరిగాయి.
జమ్ము కశ్మీర్లోని ఉరీ ఘటన తర్వాత అంతర్జాతీయ స్థాయిలో పాక్ ఏకాకిగా మారిందని, జైషే మహ్మద్, హక్కానీ నెట్వర్క్లపై చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని పాక్ విదేశీ వ్యవహారాల మంత్రి ఐజాజ్ చౌదరి అన్నారు. ఆయన వ్యాఖ్యలతో వాగ్వాదం మొదలైంది. మంత్రి వ్యాఖ్యలకు ఐఎస్ఐ చీఫ్ కల్పించుకుని గట్టిగా వాదించారు. దీంతో పరిస్థితి ఒక దశలో అదుపు తప్పింది. ఆ సమయంలో ప్రధాని కల్పించుకోవడంతో వివాదం సద్దుమణిగింది. ప్రభుత్వానికి, సైన్యానికి మధ్య విభేదాలు తలెత్తిన విషయాన్ని ఈ ఘటన రుజువు చేస్తోందని ‘డాన్’ పేర్కొంది.
యూరీ ఉగ్రదాడి తర్వాత అన్ని వైపుల నుంచి పాక్ విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. తమ దేశ సైన్యం ఉగ్రవాదులకు అండగా నిలవడం ఆపేయాలని, భారత్తో సత్సంబంధాల కోసం ప్రయత్నించాలని అమెరికాలో పాక్ మాజీ రాయబారి హుసేన్ హక్కానీ తెలిపారు. దేశ ద్రోహులకు పాకిస్థాన్ ఆశ్రయం ఇవ్వడం వల్లే పాక్ అంతర్జాతీయ స్థాయిలో ఒంటరి అయిందని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ నేత ఆరోపించారు. పాలనలో సైన్యం పాత్రను పరిమితం చేసేందుకు నవాజ్ ప్రయత్నించారని పాక్ సీనియర్ జర్నలిస్టు సలీం సేథీ అభిప్రాయపడ్డారు.
కాగా అన్ని వైపుల నుంచి విమర్శల జడివాన కురుస్తుండడంతో స్పందించిన ప్రధాని షరీఫ్ జిహాదీ గ్రూపులపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అంతేకాక పఠాన్ కోట్ ఉగ్రదాడిపై విచారణను పూర్తిచేయాలని, ముంబై దాడుల సూత్రధారి మసూద్ అజర్ కేసును రావల్పిండి కోర్టులో మళ్లీ విచారించాలని ప్రభుత్వం ఆదేశించింది. అలాగే ఉగ్రవాదులకు అందిస్తున్న సహకారం నిలిపివేయాల్సిందిగా షరీఫ్ ఐఎస్ఐని ఆదేశించారు. టెర్రరిస్టులకు దూరంగా ఉండాలంటూ సైన్యాన్ని హెచ్చరించారు. దీంతో షరీఫ్కు, సైన్యానికి మధ్య విభేదాలు తలెత్తాయని ‘డాన్’ ఆ కథనంలో పేర్కొంది.
(And get your daily news straight to your inbox)
Jul 06 | ఆండ్రాయిడ్ ఫోన్లకు కొత్త మాల్వేర్ తో ముప్పు పొంచి ఉందని ప్రముఖ సాఫ్ట్ వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ హెచ్చరించింది. ఆ మాల్వేర్ పేరు టోల్ ఫ్రాడ్. పేరులోని ఫ్రాడ్ కు తగ్గట్టుగానే ఇది మహా... Read more
Jul 06 | దేశీయ వ్యాపార దిగ్గజం, మహీంద్రా గ్రూప్ సంస్థల చైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో యాక్టీవ్గా ఉంటారు. సమకాలిన అంశాలతో స్పందిస్తూ రకరకాల పోస్ట్లను షేర్ చేయడమే కాదు. నెటిజన్లకు అడిగిన ప్రశ్నలకు రిప్లయి... Read more
Jul 06 | చుట్టూ నీళ్లు..మధ్యలో స్థంభం.. ఆ స్థంభం వద్దకు వచ్చిన ఓ ఆవు కరెంట్ షాక్తో గిలగిలా కొట్టుకుంది. ఇది చూసి ఓ దుకాణ యజమాని చలించిపోయాడు. వెంటనే ప్రాణాలకు తెగించి ఆ ఆవును కాపాడాడు.... Read more
Jul 06 | దేశీయంగా, అంతర్జాతీయంగా విమానయాన సేవలను ప్రయాణికులకు కల్పిస్తున్న స్పైస్ జెట్ విమానాయాన సంస్థ గతకొన్ని రోజులుగా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోంటోంది. తమ సంస్థకు చెందిన విమానాలు ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో... Read more
Jul 06 | హిమాచల్ ప్రదేశ్లో కుంభవృష్టి కురిసింది. కులు జిల్లాలోని పర్వతి లోయలో ఉన్న చోజ్ ముల్లా వద్ద అకస్మాత్తుగా క్లౌడ్బస్ట్ అయ్యింది. ఈ ఘటన వల్ల స్థానిక గ్రామాల్లో భారీ నష్టం సంభవించింది. చోజ్ గ్రామంలో... Read more