అనునిత్యం కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతూ మన దేశ రక్షణ రంగానికి కంట్లో నలుసుగా మారిన దాయధి పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులపై భారత రక్షణ దళాలు చొచ్చుకెళ్లి దాడులకు పాల్పడిన ఘటన వార్తలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. ఈ వార్తలపై సోషల్ మీడియాలో దేశప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా నెట్ జనులు అర్మీకి అభినందనలు తెలుపుతూ.. మీ వెంటే మేముంటామంటూ భరోసాతో చెబుతున్న మెసేజ్ వైరల్ గా మారింది.
ఇటు నెట్ జనులతో పాటు కేంద్ర మంత్రులు, రాజకీయ, సినీ ప్రముఖులు సమర్థించారు. దేశం మొత్తం సైన్యం వెనుక నిలబడుతుందని భరోసాయిచ్చారు. సోషల్ మీడియా ద్వారా తమ స్పందన తెలియజేశారు.ఉగ్రవాద స్థావరాలపై మన సైన్యం జరిపిన దాడి గర్వకారణమని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ వ్యాఖ్యానించారు. తీవ్రవాదానికి మద్దతు మానునోవాలని పలుమార్లు దౌత్యమార్గాల ద్వారా ఒత్తిడి తీసుకొచ్చినా దాయాది దేశం తన వైఖరిని మార్చుకోలేదన్నారు.
‘భారత్ మాతాకి జై. జాతి యావత్తు సైనం వెనుక ఉంటుందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, సీనియర్ నటుడు అనుమప్ ఖేర్ ట్వీట్ చేశారు. పాకిస్థాన్ తీవ్రవాదిలా వ్యవహరిస్తోందని, దానికి తగిన సమాధానం చెప్పాల్సిన అసవరముందని జమ్మూకశ్మీర్ ఉప ముఖ్యమంత్రి నిర్మల్ సింగ్ వ్యాఖ్యానించారు. పాకిస్థాన్ ఉగ్రవాదుల స్థావరాలపై దాడి భారత్ సైన్యం నైతిక స్థైర్యాన్ని పెంచుతుందని అభిప్రాయపడ్డారు. ‘తీవ్రవాదులు అందరికీ ఇది తగిన గుణపాఠం. మమ్మల్ని మేము రక్షించుకునే హక్కు మాకు ఉంద’ని బీజేపీ నాయకుడు షహనవాజ్ హుస్సేన్ అన్నారు.
ఇక భారత సైన్యం దాడులకు దేశంలోని అన్ని వర్గాల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. ఇది అద్భుతమైన ఆపరేషన్ అని, భారత సైన్యం బాగా స్పందించిందని రిటైర్డ్ ఎయిర్ మార్షల్ ఫాలీ హోమీ మేజర్ అన్నారు. ప్రధానమంత్రి మోదీ ఏం చెప్పారో అదే చేస్తున్నారని బీజేపీ నాయకుడు రాం మాధవ్ ట్వీట్ చేశారు. దేశంలోకి చొరబడుతున్న ఉగ్రవాదులను శిక్షించడం మొదలైందని ఆయన చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more