కావేరి జలాల వివాదంపై వివాదం మరోసారి ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. నీటిని వదిలే విషయమై మరోసారి సుప్రీంకోర్టుకు వెళ్లిన కర్ణాటక ప్రభుత్వానికి మళ్లీ దెబ్బతగిలిన సంగతి తెలిసిందే. తాము ముందుగా ఆదేశించినట్లే 6 వేల క్యూసెక్కుల నీటిని తమిళనాడుకు కర్ణాటక విడుదల చేయాల్సిందేనని సుప్రీంకోర్టు మరోసారి ఆదేశాలు జారీ చేయడంతో పరిస్థితి మరింత జఠిలంగా మారింది. అయితే సుప్రీం ఆదేశాలిచ్చిన సరే కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాత్రం అందుకు ససేమిరా అంటున్నట్లు తెలుస్తోంది.
ఈ మేరకు ఈ యవ్వారాన్ని బుధవారం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి తాడో పేడో తేల్చాలని చూస్తున్నారు. కాగా, సుప్రీం ఆదేశాలపై చర్చించిన కర్ణాటక రాజకీయ పార్టీలన్నీ తమిళనాడుకు నీటిని విడుదల చేయరాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. ఈ విషయంలో ప్రభుత్వానికి మద్ధతుగా నిలుస్తామని ప్రకటించాయి కూడా. దీంతో అఖిలపక్షంలో ఇదే అభిప్రాయాన్ని ఏకగ్రీవంగా ఆమోదించి, దాన్నే పాటించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్న సంకేతాలు అందుతున్నాయి.
కావేరి జలాలను రోజుకు ఆరువేల క్యూసెక్కుల చొప్పున బుధవారం నుంచి మూడు రోజుల పాటు 18 వేల క్యూసెక్కుల నీటిని తమిళనాడుకు విడుదల చేయాల్సిందేనని సుప్రీం కోర్టు మంగళవారం కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే, ఆరు వేల క్యూసెక్కులను కాకుండా, రోజుకి 3 వేల క్యూసెక్కుల నీటిని మాత్రమే విడుదల చేస్తామని.. నదిలోనే నీరు లేనప్పుడు తామేం చేయగలమంటూ సీఎం సిద్ధరామయ్య మండిపడ్డ సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉభయ సభల్లో ఈ విషయం చర్చించి ఓ నిర్ణయం తీసుకుని, ఆపై రాష్ట్రపతిని కలుశాక ఓ నిర్ణయానికి వస్తామని ప్రకటించాడు కూడా. కానీ, ఉభయ సభలు తీర్మానం చేసిన మా ఆదేశాలు పాటించాల్సిందేనని అత్యున్నత న్యాయస్థానం సిద్ధరామయ్య ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
మరోవైపు సుప్రీం కోర్టు ఆదేశాలతో బెంగళూరులో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిరసనలతో ర్యాలీలు జరుగుతుండటంతో 144 సెక్షన్ విధించారు. కాగా, తాజా ఆదేశాల ప్రకారం 28, 29 తేదీల్లో తమిళనాడుకు నీటిని విడుదల చేసేందుకు వీలుగా రిజర్వాయర్లను తెరిచి ఉంచాలని కర్ణాటక ప్రభుత్వానికి సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో ఆల్ పార్టీ మీటింగ్ లో తీసుకనే నిర్ణయం అమలు చేసే సాహసం ప్రభుత్వం చేస్తుందా అన్నది మరికాసేపట్లో తేలనుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more