రూపాయి మరోసారి దాని గొప్పతనం నిరూపించుకుంది. హా... ఒక్క రూపాయి కదా. నొక్కేస్తే పోయేది ఏముంది? అని జేబులో పాపానికి ఏళ్లుగా అతనికి కంటి మీద కునుకు కరువైంది. అన్యాయంగా రూపాయి ఎక్స్ ట్రా వసూలు చేశారంటూ ఓ వ్యక్తి కేసు వేయగా, బెంగళూర్ కి చెందిన ఓ హోటల్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే..
కొన్ని సంవత్సరాల క్రితం బెంగళూరులో వాసుదేవ్ అడిగ అనే వ్యక్తికి చెందిన ఫాస్ట్ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ హోటల్లో నర్సింహమూర్తి అనే న్యాయవాది ప్లేట్ ఇడ్లీ తిన్నాడు. అయితే ప్లేట్ ఇడ్లీ ఖరీదు రూ.24 కాగా హోటల్ యాజమాన్యం ఆయనగారి దగ్గరి నుంచి రూ.25 వసూలు చేసింది. ఆపై తన దగ్గర రూపాయి ఎక్కువ వసూలు చేశారని గ్రహించిన, దాన్ని తీవ్రంగా పరిగణించి హోటల్ యాజమాన్యంపై వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేశాడు. అంతేకాదు తనలాగా ఆ హోటల్ కి వచ్చే ఒక్కో వినియోగదారుడి నుంచి రూపాయి చొప్పున ఎక్కువ తీసుకుంటున్న హోటల్ రోజుకు ఎంత అక్రమంగా తీసుకుంటున్నదీ లెక్కలు వేసి మరీ చూపించారు. దీంతో వినియోగదారుల ఫోరం హోటల్కు నోటీసులు పంపింది.
అయితే మధ్యాహ్న భోజన పథకం కోసం స్వచ్ఛంద సంస్థల విరాళాల సేకరణలో భాగంగానే తాము ఆ ఒక్క రూపాయి అదనంగా విరాళం ఇచ్చేందుకే కస్టమర్ల నుంచి రూపాయి అదనంగా తీసుకుంటున్నట్టు హోటల్ యాజమాన్యం పేర్కొంది. ఈ వాదనతో కన్జ్యుమర్ ఫోరం ఏకీభవించలేదు. అదనంగా రూపాయి వసూలు చేసిందుకు నష్టపరిహారం కింద బాధితుడికి వెయ్యి రూపాయలు చెల్లించడంతోపాటు కోర్టు ఖర్చుల కింద మరో వెయ్యి రూపాయలు చెల్లించాలని 2014లో ఆదేశించింది.
ఈ తీర్పును సవాలు చేస్తూ హోటల్ యాజమాన్యం హైకోర్టుకు వెళ్లినా ఫలితం లేకుండా పోయింది. దిగువ కోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించాలని ఆదేశిస్తూ కేసును డిస్మిస్ చేసింది. ఈ మధ్య హైదరాబాద్ లో ఓ లేడీ కండక్టర్ రూపాయి నొక్కేసిందటూ ప్రయాణికురాలు గొడవ చేయటం, ఫిర్యాదుతో ఆ కండక్టర్ ను బదిలీ చేయటం, మద్ధతుగా కార్మికులు ఒక్కరోజు సమ్మె చేయటం, కోటి రూపాయల దాకా నష్ట వాటిల్లడం తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more