మీకు బ్యాంకు డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డులున్నాయా..? అన్ లైన్ అకౌంట్, మెబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ చేస్తుంటారా..? అయితే మీరు తక్షణం వెళ్లి మీరు పిన్ నెంబర్లను, పాస్ వర్డులను మార్చుకోండి. లేదంటే మీ కార్డు మీ వద్దే వున్నా.. మీ అకౌంట్ లోని డబ్బులు మాత్రం ధొంగల పాలవ్వడం గ్యారెంటీ. ఎందుకైనా మంచిది. ముందస్తుగా వెళ్లి మీ పిన్ నెంబర్లను మార్చుకోండి.. అంటూ బ్యాంకులు తమ కస్టమర్లకు సూచిస్తున్నాయి. ఈ మేరకు బ్యాంకు అధికారులు తమ కస్టమర్లకు ఏకంగా హెచ్చరికలు జారీ చేశారు.
మరీ ముఖ్యంగా హెచ్ డీఎఫ్ సీ, ఫెడరల్ బ్యాంక్, డీబీఎస్ బ్యాంకు అధికారులు తమ ఖాతాదారులను ఎస్ ఎంఎస్ ల ద్వారా అలర్డ్ చేస్తున్నారు. కేరళ, ఢిల్లీ, చండీఘడ్ రాష్ట్రాల్లో వెలుగు చూసిన ఏటీయం కుంభకోణాల నేపథ్యంలో ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. ఇటీవల ఇక్కడ ఏటీఎం కార్డుదారుల లక్షల రూపాయలు మాయమైన కేసులు నమోదు కావడంతో అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. ఏటీఎం మోసాలు పెరుగుతున్నాయంటూ ఖాతాదారులకు సేఫ్ బ్యాంకింగ్ పై అవగాహన కల్పిస్తున్నారు. గార్డు లేని, జనావాసాలు లేని ప్రాంతాలలోని ఏటీఎం లావాదేవీలను నివారించాలని బ్యాంకులు కోరాయి.
కాగా కేరళలో గత నెలలో రోమేనియన్ వ్యక్తి ఏటీఎం కేంద్రం వద్ద కిమ్మింగ్ పరికరాన్ని అమర్చుతూ అరెస్టయిన సంగతి తెలిసిందే. యావత్ ధేశంలోని 65 కోట్ల మంది బ్యాంకు కస్టమర్లలో సుమారుగా 60 శాతం మంది వినియోగిస్తున్న బ్యాంకు ఏటీయం, క్రెడిట్ కార్డులు ఐస్కాంత స్ట్రిప్ లో తమ కస్టమర్ తాలుకు సమాచారంతో పాటు డాటాను పొందుపర్చింది. ఇది కిమ్మింగ్ కు లభ్యమయ్యే అవకాశాలు అధికంగా వున్నాయి. దీంతో అర్బీఐ అన్ని బ్యాంకులకు భద్రతాపరగా వుండే ఈఎంవీ తరహా ఫార్మెట్ లో డెబిట్, క్రెడిట్ కార్డులను అందజేయాలని కూడా అదేశించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more