మలేసియాలో శ్రీలంక రాయబారిపై దాడి జరిపిన ఐదుగురిని అక్కడి మలేషియా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మలేసియా రాజధాని కౌలాలంపూర్ లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన ఈ దాడిలో శ్రీలంక రాయబారి ఇబ్రహీం సాహిబ్ అన్సర్ కు స్వల్ప గాయాలయ్యాయి. ఎయిర్ పోర్టులోకి ఎంటరైన అన్సర్ తిరిగి తన కార్యాలయానికి చేరకుంటున్న క్రమంలో అయపపై గుర్తు తెలియని దుండగులు విరుచుకుపడ్డారు. అన్సర్ పై పిడిగుద్దులు కురిపించిన దుండగులు ఆపై అక్కడి నుంచి పరారయ్యారు.
అయితే కాస్తంత ఆలస్యంగా స్పందించిన మలేసియా పోలీసులు ఈ దాడికి సంబందించిన సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఐదుగురు దుండగులను అరెస్ట్ చేశారు. అయితే అరెస్టైన దుండగులు ఏ దేశానికి చెందిన వారన్న వివరాలను కౌలాలంపూర్ పోలీసులు వెల్లడించలేదు. అంతేకాకుండా దాడికి దారి తీసిన కారణాలపైనా వారు నోరు విప్పలేదు. శ్రీలంక మంత్రి దయా గయాజ్ సహా మాజీ అధ్యక్షులు మహింద్ర రాజపక్స తదితరులను ఆయన అప్పుడే శ్రీలంక విమానాన్ని ఎక్కించి వెనుదిరిగారు. ఇంతలో అక్కడికి చేరుకున్న తమిళుల బృందం ఆయనపై దాడి చేసింది.
అయనకు ఎదురుగా వచ్చిన తమిళుల బృందం మాజీ అధ్యక్షులు మహింధ్రా రాజపక్సే ఎక్కడున్నాడని అడిగింది. అందుకు ఆయన తననెందుకు అడుగుతున్నారని, అ వివరాలు కావాలంటే పోలీసులన వద్దకు వెళ్లాలని బదులిచ్చారు. దీంతో శ్రీలంకలో పలు యుద్ద నేరాలకు పాల్పడి.. మానవ హక్కులను నిర్ధాక్షిణ్యంగా కాలరాసిన రాజపక్సేకు వ్యతిరేకంగా ప్రదర్శన ఇద్దామని వచ్చిన బృందం దౌత్యవేత్త ఇచ్చిన సమాధానంతో మండిపడి ఆయనపై దాడులకు పాల్పడిందని సమాచారం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more