ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన తెలుగుదేశం నేతలకు ఇది మరో చేధు వార్తే. ఎందుకంటారా.. ఈ కేసులో మరో అధారం కూడా లభించింది. స్వయంగా టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబే.. టీఆర్ఎస్ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు యాభై లక్షల రూపాయలు పంపారనడానికి ఇది కూడా మరో అధారంగా పరిగణించాల్సి వస్తుందని అంటున్నారు ఏపీ విఫక్ష నేతలు. అదేంటంటే టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి కారు డ్రైవర్ వున్నా.. ఆయనను కాదని, రేవంత్ వెంట నారా లోకేష్ ను డ్రైవర్ గా పంపించారని వైసీపీ అధికార ప్రతినిధి బోత్స సత్యనారాయణ అరోపించారు.
పిల్లనిచ్చిన మామ అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీయార్ ను వెన్నుపోటు పోడిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. రాజకీయాలలో తన నీడను కూడా నమ్మడని అందుకు ఇదే ఉదాహరణ అని పేర్కోన్నారు. రేవంత్ రెడ్డిపై కూడా పూర్తి విశ్వసం లేకనే.. లోకేష్ కారు డ్రైవర్ ను ఆయన కారు డ్రైవర్ గా పంపించారని అన్నాడు. రాజధాని లేని రాష్ట్రమని మొసలి కన్నీరు కార్చిన ముఖ్యమంత్రి.. రాజధాని కోసమంటూ రాష్ట్ర ప్రజలు, ఉద్యోగులు, కార్మీకులు ఇచ్చిన విరాలాలను తన సొంత పార్టీ ప్రయోజనాల కోసం వినియోగించుకున్నారని బొత్స దుయ్యబట్టారు. ఇప్పుడు కూడా కేసుల నుంచి తప్పించుకునేందుకు రాష్ట్రప్రయోజనాలను తాకట్టు పెట్టరాదని హితవు పలికారు.
ఓటుకు నోటు కేసులో టీడీపీ నేతలు తప్పులు చేయడమే కాకుండా చట్టాన్ని చేతిలోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. కేసు నుంచి తప్పించుకోవడానికి టీడీపీ నేతలు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ పలు అసత్యాలు పలుకుతున్నారని, ఎవరు చెవిలో పూలు పెడతారని ఆయన దుయ్యబట్టారు. ఈ కేసును నీరుగార్చేందుకు కూడా ప్రయత్నాలు సాగుతున్నాయని బొత్స ఆరోపించారు. తాన రాజకీయ జీవితం తెరచిన పుస్తకమని, నీతికి నిజాయితీకి తానోక నిలువుటద్దమని తనకు తాను బాడాయిలకు పోయే చంద్రబాబు.. నిజంగా తాను అన్న మాటాలకు కట్టుబడి వుంటే కేసు విచారణకు ఎలాంటి అవరోదాలు, కేంద్రం నుంచి ఒత్తిళ్లు తీసుకురావద్దని బోత్స డిమాండ్ చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more