రియో ఒలంపిక్స్ లో రెండు పతాకాలతో సరిపెట్టుకున్న భారత్ ఇద్దరమ్మాయిల పుణ్యమాని పరువు నిలుపుకుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కాసేపటి క్రితం ఖేల్ రత్న పురస్కారాలు ప్రకటించడం విశేషం. తొలిసారిగా నలుగురు క్రీడాకారులకు రాజీవ్ ఖేల్ రత్న పురస్కారం అందించనున్నట్లు క్రీడా మంత్రిత్వ శాఖ తెలిపింది.
రజతంతో మెరిసిన పీవీ సింధుకి, కాంస్యంతో అలరించిన సాక్షి మాలిక్ కు, అలాగే జిమ్నాస్టిక్స్ లో సత్తా చాటిన దీపా కర్మాకర్, షూటర్ జీతూ రాయ్ లకు ఖేల్ రత్న పురస్కారాలు వరించనున్నాయి. అలాగే ఆరుగురికి ద్రోణాచార్య పురస్కారం అందించనున్నట్లు తెలిపింది. దీపా కర్మాకర్ కోచ్ విశ్వేశ్వర్ నందికి ద్రోణాచార్య అవార్డు ప్రకటించింది. నాగపురి రమేశ్(అథ్లెటిక్స్), సాగర్ మాల్ ధ్యాయల్ (బాక్సింగ్), రాజ్కుమార్ శర్మ (క్రికెట్), ప్రదీప్ కుమార్ (స్విమ్మింగ్), మహావీర్ సింగ్ (రెజ్లింగ్)లకు ద్రోణాచార్య పురస్కారం ప్రకటించింది.
15 మందకి అర్జున అవార్డులు:
కేంద్ర ప్రభుత్వం ఈరోజు 15 మందికి అర్జున అవార్డులు(2016) ప్రకటించింది. రజత్ చౌహాన్ (ఆర్చరీ), లలితా బాబర్ (అథ్లెటిక్స్), సౌరవ్ కొఠారి (బిలియర్డ్స్), శివథాపా(బాక్సింగ్), అజింక్యా రహానే(క్రికెట్), సుబ్రతా పాల్(ఫుట్బాల్), రాణి(హాకీ), వీఆర్ రఘునాథ్(హాకీ), గురుప్రీత్సింగ్(షూటింగ్), అపూర్వి చందేలా(షూటింగ్), సౌమ్యజిత్ ఘోష్(టేబుల్ టెన్నిస్), వినేశ్ (రెజ్లింగ్), అమిత్కుమార్(రెజ్లింగ్), సందీప్సింగ్ మాన్ (పారా అథ్లెటిక్స్), వీరేంద్ర సింగ్(రెజ్లింగ్-బధిర)కు అర్జున అవార్డులు ప్రదానం చేయనున్నట్లు తెలిపింది.
ఇక ముగ్గురికి ధ్యాన్చంద్ అవార్డు(2015)లను అందించనున్నట్లు కేంద్రం పేర్కొంది. సత్తి గీత(అథ్లెటిక్స్), సివ్లానస్ ధంగ్ ధంగ్(హీకీ), రాజేంద్ర ప్రహ్లాద్ షెల్కె (రోయింగ్)లకు ఈ అవార్డులు ప్రదానం చేయనున్నట్లు తెలిపింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more