రియో ఒలంపిక్స్ సెమీస్ కు చేరిన సానియా-బోపన్న, క్వార్టర్ కి చేరిన వికాస్ కృష్ణన్ | Bopanna Mirza Enter Semis and Vikas Krishan in Quarters

Bopanna mirza enter semis and vikas krishan in quarters

Bopanna Mirza Enter Semis, sania in Rio olumpics, Vikas Krishan in Rio olympics Quarters, Olympics Day 7 India, India Miced doubles

Bopanna Mirza Enter Semis and Vikas Krishan in Quarters.

రియో లో భారత ఆశలు చిగురిస్తున్నాయి

Posted: 08/13/2016 07:41 AM IST
Bopanna mirza enter semis and vikas krishan in quarters

ఏడు రోజులు దాటినా పతకాల వేటలో భారత్ బోణీ చేయకపోవటంతో రియో ఒలింపిక్స్ సమరం నుంచి అవమానకరరీతిలో నిష్క్రమించాల్సి వస్తుందేమోనన్న భయాలు నెలకొన్నాయి. ఆశలు పెట్టుకున్న ఆటగాళ్లంతా వరుసగా వైఫల్యం చెందుతూ ఇంటికొచ్చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టెన్నిస్ మిక్స్ డ్ డబుల్స్ విభాగంలో హైదరాబాదీ సంచలనం సానియా మీర్జా , రాహుల్ బోపన్న జోడీ ఆశలు చిగురింపజేశాయి.

క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో ఈ జోడీ విజయం సాధించి సెమీస్ దూసుకెళ్లింది. ఆండీ ముర్రే- వాట్సన్ జోడీపై వీరు 6-4, 6-4 స్కోరు తేడాతో విజయం సాధించిన సానియా- బోపన్న జోడీ నేరుగా సెమీ ఫైనల్ చేరుకుని టైటిల్ కు మరో అడుగు దూరంలో నిలిచారు.

ఇక భారత్ కు చెందిన మరో క్రీడాకారుడు సత్తా చాటాడు. బాక్సింగ్ లో 75 కిలోల విభాగంలో కొద్దిసేపటి క్రితం ముగిసిన మ్యాచ్ లో భారత్ బాక్సర్ వికాస్ కృష్ణన్ క్వార్టర్ ఫైనల్ బెర్తు ఖరారు చేసుకున్నాడు. టర్కీకి చెందిన బాక్సర్ సిపాల్ పై పవర్ పంచ్ లు విసిరిన వికాస్ 3- 0 స్కోరుతో విజయం సాధించాడు. ఈ విజయంతో వికాస్ నేరుగా క్వార్టర్ ఫైన్ చేరుకున్నాడు. నిన్నటిదాకా పేలవ ప్రదర్శన కనబరచిన భారత్... నేడు మాత్రం రెండు వరుస విజయాలతో సత్తా చాటింది. పతకం ఆశలు కూడా దాదాపుగా కనిపించడం లేదని ఫీలవుతున్న సగటు భారతీయుడికి ఇది కాస్త ఊరటినిచ్చే అంశం.

Vikas krishnan in Rio Quarters

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Olympics  2016  India  Day 7  Bopanna Mirza  

Other Articles