రిజర్వ్ బ్యాంకు గవర్నర్గా రఘురామ్ రాజన్ తన చిట్టచివరి ద్రవ్య, విధాన పరపతి సమీక్షా సమావేశంలో మెరుపులు మెరిపిస్తారా...? వెళుతూ వెళుతూ రేట్లను కోసేసి పారిశ్రామిక, బ్యాంకింగ్, మార్కెట్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తారా..? చాలామంది ఇలాగే ఆలోచిస్తుండటంతో ఇప్పుడు అందరి కళ్లూ భారతీయ రిజర్వు బ్యాంకు ద్రవ్య పరపతి విధాన సమీక్షపైనే పడ్డాయి. తన హయంలో భారత ఆర్థిక పరిస్థితిని మందగమనం నుంచి కాపాడిన వ్యక్తిగా పలువురి ప్రశంసలు అందుకున్న రాజన్.. చివరి కాలంలో మాత్రం బీజేపి సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి నుంచి విమర్శలను ఎదర్కోన్నాడు. అయితే ఈ అంశంపై కేంద్రమంత్రుల నుంచిగానీ, లేక ప్రధాని నుంచి కానీ ఎలాంటి సానుకూల స్పందన రాకపోవడంతో ఆయన తాను రెండో పర్యాయం చేయనని ప్రకటించారు, ఆ తరువాత ఆయనకు మద్దతుగా ప్రధాని నరేంద్ర మోడీ పలు వ్యాఖ్యలు చేప్పారు, అయితే అప్పటికే చేతుల కాలడంతో రాజన్ వీడ్కోలు పలికే సమయం రానేవచ్చింది.
సెప్టెంబర్ 4న ఆర్బీఐ గవర్నర్ బాధ్యతల నుంచి తప్పుకోనున్న రాజన్కు ఇదే చివరి పరపతి విధాన సమీక్షా సమావేశం. రిటైల్ ద్రవ్యోల్బణం అధిక స్థాయిల్లోనే కొనసాగుతున్నందున ఆర్బీఐ రేట్ల విషయంలో యథాతథ స్థితిని కొనసాగించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. కానీ, అధిక వడ్డీ రేట్లను కొనసాగిస్తున్నారన్న విమర్శలను ఆయన ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రాజన్ కీలక రేట్లలో మార్పులు చేసే అవకాశం లేకపోలేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించవచ్చునని, ద్రవ్యోల్బణం వరుసగా రెండో నెలలో 5.7శాతానికి పెరగడంతోపాటు జూలై, ఆగస్టు నెలల్లోనూ అధిక స్థాయిల్లోనే కొనసాగుతున్న నేపథ్యంలో తదుపరి వడ్డీ రేట్లలో కోత అన్నది ద్రవ్యోల్బణం తీరు, మానిటరీ పాలసీ కమిటీ ఏర్పాటుపైనే ఆధారపడి ఉంటేందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more