పంద్రాగష్టున మోదీ ప్రాణాలకు ముప్పు | This Independence Day threat to PM's life higher

This independence day threat to pm s life higher

attack on Modi, August 15 redfort attack, modi speech at august 15 2016, terror threat to modi, modi red fort

Central intelligence agencies had informed the SPG and anti-terror units a few weeks ago about the possibility of coordinated attacks on August 15 at Modi's Speech.

మోదీని ఎసేయడానికి భారీ స్కెచ్

Posted: 07/29/2016 09:05 AM IST
This independence day threat to pm s life higher

దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రాణాలకు పెనుముప్పు పొంచి ఉందన్న నిఘా వర్గాల సమాచారంతో ఒక్కసారిగా భద్రతా దళాలు అలర్ట్ అయ్యాయి. ఈ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటపై దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన కీలక ప్రసంగం చేయనున్న సమయంలో డ్రోన్ ద్వారా దాడి చేసేందుకు ఉగ్రమూకలు పొంచి ఉన్నాయంట. ఈ మేరకు కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రధాని భద్రతా విధులను పర్యవేక్షిస్తున్న స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ), ఉగ్రవాద నిర్మూలన దళాలను అప్రమత్తం చేశాయి.

నిజానికి మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్యానంతరం ఎర్రకోట నుంచి ప్రసంగించే ప్రధానుల కోసం భద్రతా దళాలు బుల్లెట్ ప్రూఫ్ ఎన్ క్లోజర్ ను వినియోగిస్తున్నాయి. అయితే మోదీ మాత్రం తన తొలి ప్రసంగం నుంచే బుల్లెట్ ప్రూఫ్ ఎన్ క్లోజర్ ను తిరస్కరిస్తూ బహిరంగంగా ఉపన్యసిస్తూ వస్తున్నారు. అయితే దాడి జరుగుతున్న సమాచారం తెలిసి కూడా ప్రధాని అదే తరహా నిర్ణయం తీసుకుంటారేమోనన్న ఆందోళనతో కేంద్ర నిఘా వర్గాలు ఎస్పీజీని అప్రమత్తం చేశాయి.

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులతో పాటు ఆల్ కాయిదా, లష్కరే తోయిబా, జైషే మొహ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్, హిర్కతుల్ జిహాదీ ఇస్లామీ తదితర సంస్థలు క్షిపణులతో విరుచుకుపడేందుకు పన్నాగం పన్నుతున్నాయని నిఘా వర్గాల దగ్గర పక్కా సమాచారం ఉందట. దీంతో అప్రమత్తమైన నిఘా వర్గాలు ఎస్పీజీతో పాటు ఉగ్రవాద నిర్మూలన దళాలను అప్రమత్తం చేస్తూ ఇటీవలే ఓ నివేదికను కేంద్రానికి అందించాయి. ఉగ్రవాదుల నుంచి పెను ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఈ దఫా మోదీ బుల్లెట్ ప్రూఫ్ ఎన్ క్లోజర్ నుంచే ప్రసంగించేలా చర్చలు తీసుకోవాలని కూడా నిఘా వర్గాలు ప్రభుత్వానికి సూచించాయి కూడా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : PM Modi  terrorists  august 15  attack  red fort  

Other Articles