దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రాణాలకు పెనుముప్పు పొంచి ఉందన్న నిఘా వర్గాల సమాచారంతో ఒక్కసారిగా భద్రతా దళాలు అలర్ట్ అయ్యాయి. ఈ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటపై దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన కీలక ప్రసంగం చేయనున్న సమయంలో డ్రోన్ ద్వారా దాడి చేసేందుకు ఉగ్రమూకలు పొంచి ఉన్నాయంట. ఈ మేరకు కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రధాని భద్రతా విధులను పర్యవేక్షిస్తున్న స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ), ఉగ్రవాద నిర్మూలన దళాలను అప్రమత్తం చేశాయి.
నిజానికి మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్యానంతరం ఎర్రకోట నుంచి ప్రసంగించే ప్రధానుల కోసం భద్రతా దళాలు బుల్లెట్ ప్రూఫ్ ఎన్ క్లోజర్ ను వినియోగిస్తున్నాయి. అయితే మోదీ మాత్రం తన తొలి ప్రసంగం నుంచే బుల్లెట్ ప్రూఫ్ ఎన్ క్లోజర్ ను తిరస్కరిస్తూ బహిరంగంగా ఉపన్యసిస్తూ వస్తున్నారు. అయితే దాడి జరుగుతున్న సమాచారం తెలిసి కూడా ప్రధాని అదే తరహా నిర్ణయం తీసుకుంటారేమోనన్న ఆందోళనతో కేంద్ర నిఘా వర్గాలు ఎస్పీజీని అప్రమత్తం చేశాయి.
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులతో పాటు ఆల్ కాయిదా, లష్కరే తోయిబా, జైషే మొహ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్, హిర్కతుల్ జిహాదీ ఇస్లామీ తదితర సంస్థలు క్షిపణులతో విరుచుకుపడేందుకు పన్నాగం పన్నుతున్నాయని నిఘా వర్గాల దగ్గర పక్కా సమాచారం ఉందట. దీంతో అప్రమత్తమైన నిఘా వర్గాలు ఎస్పీజీతో పాటు ఉగ్రవాద నిర్మూలన దళాలను అప్రమత్తం చేస్తూ ఇటీవలే ఓ నివేదికను కేంద్రానికి అందించాయి. ఉగ్రవాదుల నుంచి పెను ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఈ దఫా మోదీ బుల్లెట్ ప్రూఫ్ ఎన్ క్లోజర్ నుంచే ప్రసంగించేలా చర్చలు తీసుకోవాలని కూడా నిఘా వర్గాలు ప్రభుత్వానికి సూచించాయి కూడా.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more