ఓవైపు ప్రత్యేక కోర్టు కోసం కొట్టేసుకుంటున్న తరుణంలో మరో వివాదం రెండు రాష్ట్రాల మధ్య చిలికి చిలికి గాలి వానగా మారుతోంది. అయితే ఇంతకు ముందు సమస్యల్లాగానే దీనిని కూడా పరిష్కరించేందుకు కేంద్రం చొరవతీసుకోంటోంది. విజయా బ్రాండ్ పాల విక్రయాలపై ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించేందుకు ఈ నెల 15న ఢిల్లీకి రావాలని ఇరు రాష్ట్రాలకు చెందిన అధికారులకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.
సమస్య ఏంటంటే...
తెలుగు నేల ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో ‘విజయా’ బ్రాండ్ పాలను ప్రభుత్వమే మౌలాలిలోని కేంద్రం ద్వారా ప్రాసెస్ చేసి విక్రయించేది. ఏపీ డెయిరీ సమాఖ్య ద్వారా కొనసాగిన ఈ వ్యాపారం విభజన తర్వాత కూడా ఇరు రాష్ట్రాల్లోనూ కొనసాగుతోంది. రెండు రాష్ట్రాలు కూడా ‘విజయా’ బ్రాండ్ పేరిటే పాలను విక్రయిస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం ‘విజయా’ పాత బ్రాండ్ తోనే ఈ వ్యాపారం చేస్తుండగా, తెలంగాణ సర్కారు మాత్రం ‘విజయా’ బ్రాండ్ కు ‘తెలంగాణ’ ట్యాగ్ తగిలించి... తెలంగాణ పాడి సమాఖ్య ద్వారా ఈ వ్యాపారాన్ని కొనసాగిస్తోంది.
అదే సమయంలో ఏపీ సర్కారు అక్కడి పాలను తెలంగాణ రవాణా చేసి మహబూబ్ నగర్ జిల్లా సరిహద్దులో ఉన్న సాంబశివా డెయిరీ వద్ద ప్రాసెస్ చేయించి తెలంగాణలోకి వదులుతోంది. విషయం తెలిసిన తెలంగాణ పాడి సమాఖ్య సదరు పాలు విజయా బ్రాండ్ వి కాదని, అవి నకిలీవంటూ వారం క్రితం ఓ ప్రకటన విడుదల చేసింది. దీంతో ఆగ్రహానికి గురైన ఏపీ తెలంగాణ పాడి సమాఖ్య ప్రకటన పూర్తిగా అవాస్తవమని వివరణ ఇచ్చుకుంది. దీంతో రెండు రాష్ట్రాల మధ్య ఈ వివాదం మరింత ముదిరింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more