తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎలా ఉంటాయో, వాటి రూపకల్పన, అమలు చేసే తీరు చూస్తే ఎవరికైనా మతిపోతుంది. ఏ రూట్ లో వెళితే అవి సక్సెస్ అవుతాయోనన్న పల్స్ ను పట్టుకుని ఆయన ముందుకు సాగుతుంటాడు. రాష్ట్రాన్ని పచ్చదనంతో నింపేయడానికి ప్రారంభించిన బృహత్తర సంక్షేమ పథకం హరిత హరంకు ఇప్పుడు గ్లామర్ సొగసులు అద్దేసింది టీ ప్రభుత్వం.
ఇప్పటికే అఖిల్, రకుల్ ప్రీత్ సింగ్, రాశిఖన్నా, రెజీనా లాంటి యువనటీనటులంతా ఇందులో పాల్గొనగా ఒక్క సోమవారమే దాదాపు స్టార్ సెలబ్రిటీలంతా ఇందులో బాగస్వాములయ్యారు. కేబీఆర్ పార్క్లో నగర మేయర్ బొంతు రామ్మోహన్ తో పాటు నటుడు, మా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, స్టార్లు శ్రీకాంత్, శివాజీరాజా, తనికెళ్ల భరణి తదితరులు మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బంజారాహిల్స్లోని తన ఇంటి వద్ద ఏర్పాటు చేసిన హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కను నాటారు. తన భార్య సేహా రెడ్డి, కుమారుడు అయాన్ తో కలిసి మొక్క నాటి ప్రారంభించాడు. ఇందులో నిర్మాత అల్లు అరవింద్ కూడా పాల్గొన్నాడు. నగరాన్ని పచ్చగా తయారు చేయడం మనకీ, మన తరువాతి తరానికి మంచిదని, ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తు కేసీఆర్ ప్రభుత్వం మంచిపని చేస్తోందని బన్నీ ఈ సందర్భంగా తెలిపాడు. ఇక నగరంలో అక్కడక్కడా అల్లు అర్జున్ పేరుతో హరితహరం పోస్టర్లు వెలువడటం విశేషం.
మరోవైపు సినీయర్ హీరోలు చిరంజీవి, నాగార్జునలు కూడా ఇందులో పాల్గొన్నారు. ఇక పిల్మ్ నగర్ లో జరిగిన కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీతో కలిసి సీనియర్ రచయిత పరుచూరి గోపాలకృష్ణ హరితహారంలో పాల్గొన్నారు. నగర శివారులోని నానక్ రామ్ గూడలో నటుడు దగ్గుబాటి రానా మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నాడు. వీరితోపాటు రాష్ట్ర గవర్నర్ నరసింహన్, కేటీఆర్, హరీష్ రావు, నగర సీపీ ఆనంద్ తదితరులంతా హరితహరంలో నగరమంతా హడావుడి చేశారు. మొత్తం మీద తన పథకం సక్సెస్ అయ్యేందుకు సూపర్ స్కెచ్ వేసుకుని ముందుకు నడుస్తున్నారు తెలంగాణ సీఎం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more