రాష్ట్రంలోని అన్ని కుటుంబాల వివరాల సేకరణలో బాగంగా ఏపీ ప్రభుత్వం స్మార్ట్ పోల్ సర్వేను (ప్రజా సాధికార సర్వే) ప్రారంభించింది. శుక్రవారం ఉదయం ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం నుంచే ఈ కార్యక్రమాన్ని అధికారులు ప్రారంభించారు. ఆయన ఓపికగా తన వ్యక్తిగత వివరాలను దగ్గరుండి మరీ వివరించారు. తెలంగాణలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేకి జిరాక్స్ అని చెబుతున్నప్పటికీ, పూర్తిగా ఆన్ లైన్ లోనే దీనిని నిర్వహిస్తుండటం విశేషం.
ప్రతీ పౌరుడి ఆర్థిక, సామాజిక స్థితిగతులు తెలుసుకోవటంతోపాటు, వారికి చెందాల్సిన హక్కులను అందజేయడమే దీని లక్ష్యమని సీఎం చంద్రబాబు తెలిపారు. మొత్తం ఆరు వారాలపాటు కొనసాగనున్న ఈ సర్వేలో మొత్తం 30 వేల మంది అధికారులు పాల్గొంటారు. ఇళ్లు, భూమి, ఆదాయం తదితర వివరాలతోసహా మొత్తం 83 అంశాలపై పూర్తి వివరాలను సేకరిస్తారు. రోజుకు ఒక్కొక్కరు 15 నుంచి 20 కుటుంబాల సమాచారం లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేకాదు కేవలం యాప్ద్వారానే 1.48 కోట్ల కుటుంబాల వివరాలు సేకరించేందుకు సిద్ధమైపోతున్నారు..
ఆధార్, కుల, ఆదాయం వంటి 20 పత్రాల ద్వారా వివరాలు సేకరించనున్నారు. జిప్పర్ కోడ్ పేరిట ప్రతి ఇంటికీ 8 లక్షరాల్లో సరికొత్త డిజిటల్ నెంబర్లు ఇస్తారు. పుట్టిన పిల్లలకు కూడా ఆధార్ అందించడం, ప్రతీ పౌరుడి ఆధార్ ను అన్ని పథకాలకు అనుసంధానం దీని ప్రత్యేకతగా చెబుతున్నారు. ఆధార్ కార్డు లేని వారికి వేలిముద్రలు, బ్యాంకు ఖాతాలు లేని వారికి అప్పటికప్పుడే తెరిచేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. కొత్త సభ్యుల చేరికతోపాటు తప్పుల సవరణకు వీలుగా అవకాశం కల్పించనున్నారు.
సర్వే ఆధారంగా ఆధార్, కుల, ఫోటోలను తీసి జీపీఎస్ కు అనుసంధానం చేస్తారు. ఇక నుంచి ఆన్లైన్ ద్వారా వ్యక్తిగత సమాచారంతోపాటు, ఇంటి చిరునామాను, మొబైల్ నంబర్ ను తెలుసుకునేలా ఏర్పాట్లు కల్పిస్తున్నారు. ఈ నెల 31 వరకు తొలివిడత సర్వే జరుగుతుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more