ఎప్పటిలాగే అమ్మకు బై చెప్పి ఆఫీసుకు వెళ్తున్న ఆ యువతికి అదే ఆఖరి రోజు అవుతుందని బహుశా అనుకుని ఉండదు. అందరూ చూస్తుండగానే బిజీ రైల్వే స్టేషన్ లో ఆమెపై ఘోరం జరిగింది. చుట్టూ జనాలు ఉన్నప్పటికీ ఎవరూ కూడా అతన్ని నిలువరించే ప్రయత్నం చేయలేదు. తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెను నరికి చంపాడు. తమిళనాడులోని నుంగంబాకం రైల్వేస్టేషన్లో శుక్రవారం చోటుచేసుకున్న ఈ ఘటనలోకి వెళితే...
దక్షిణ గంగై వీధిలో నివసించే స్వాతి (24) ఇన్ఫోసిస్ లో పని చేస్తోంది. ఎప్పటిలాగే తండ్రి శ్రీనివాసన్ శుక్రవారం కూడా ఆమెను నుంగబాకం రైల్వేస్టేషన్ వద్ద దించి వెళ్లాడు. కాసేపట్లో రైలు వస్తుందనగా ఆమె ప్లాట్ఫాం మీద నిల్చుంది. ఇంతలో ఓ యువకుడు ఆమె సమీపంలోకి వచ్చి తనతో తెచ్చుకున్న కోడవలితో ఆమెపై దాడి చేశాడు. అంతే కొద్ది క్షణాల్లోనే ఆమె రక్తపుమడుగులో పడి చనిపోయింది. అక్కడ సీసీ కెమెరా లేకపోవటంతో పోలీసులు ప్రత్యక్ష సాక్ష్యలను విచారించారు.
నల్ల ప్యాంటు వేసుకున్న ఆ యువకుడికి, స్వాతికి మధ్య కాసేపు తీవ్ర వాగ్వాదం జరిగిందని, కోపోద్రిక్తుడైన అతను తన బ్యాగులోంచి కోడవలి తీసి ఆమెను పాశవికంగా నరికాడని వారు చెబుతున్నారు. కొన్నాళ్ల క్రితం ఆమెకు, ఓ క్యాబ్ డ్రైవర్తో గొడవ అయ్యిందట. దీంతో అతనే ఈ పని చేశాడా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. మరోవైపు ప్రేమ కోణం కూడా ఉండి ఉండొచ్చని పోలీసులు చెబుతున్నారు. ఘటన జరిగే సమయంలో స్టేషన్లో వందల మంది ఉండి కూడా ఏ ఒక్కరు అతన్ని ఆపే ప్రయత్నం చేయకపోవటం గమనార్హం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more