దేశ రాజధాని ప్రతిష్టను దిగజారుస్తూ రోజు రోజుకు భరితెగించి యువతులపై తెగబడుతున్న మగమృగాళ్ల నుంచి బాధితులను కాపాడేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడం లేదని, దీంతోనే ఢిల్లీలో వరుసగా యువతులపై అఘాయిత్యాలు, అత్యాచారాలు జరుగుతున్నాయని విమర్శలు వస్తున్నాయి. అటు కేంద్రమంత్రులు, ఇటు రాష్ట్ర మంత్రలు, వారి బందోబస్తు నేపథ్యంలో అసలే సిబ్బంది కోరతతో వున్న ఢిల్లీ పోలీసులు నేరాలను అదుపు చేయడంలో విఫలమవుతున్నారని విమర్శలూ వున్నాయి. అయినా కేంద్ర ప్రభుత్వం మాత్రం.. ఇప్పుడిక అన్న ప్రచారాలతో హోరెత్తిస్తూ.. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందో తప్ప ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వున్నాయి.
వారం రోజుల క్రితం ఓ యువతిని కొందరు అగంతకులు కిడ్నాప్ చేసి రాత్రంతా కదులుతున్న కారులో అమెపై అత్యాచారం చేసి ఉదయాన్నే సన్ లైట్ కాలనీలోని ఫ్లై ఓవర్ వద్ద అమెను పడేసి వెళ్లిపోయిన ఘటన నమోదు కాగా, సరిగ్గా అలాంటి నిర్భయ ఘటనే మారోమారు సంభవించింది. నిర్భయ ఘటనను రాజకీయంగా వినియోగించుకున్న గత విపక్షాలు ఇప్పడు అధికారంలోకి వచ్చినా.. ప్రయోజనం లేకుండా పోయింది. గడప దాటిని చేష్టలతో వారు సాగిస్తున్న ప్రచార హోరు ఒకటైతే.. జరుగుతున్న వాస్తవాలు మరోకటి.
తాజాగా, సినిమా చూసి ఇంటికి తిరిగొస్తున్న 25 ఏళ్ల మహిళను కారులో అపహరించిన ముగ్గురు వ్యక్తులు.. కదులుతున్న కారులోనే ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. ఈ దారుణం దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. ఈ కేసులో ముగ్గురినీ పోలీసులు అరెస్టు చేశారు. దక్షిణ ఢిల్లీలోని వసంత విహార్ ప్రాంతంలో పీవీఆర్ ప్రియా థియేటర్లో సినిమా చూసి, స్నేహితురాలితో కలిసి తెల్లవారుజామున 3.15 గంటల సమయంలో తిరిగి ఇంటికి వెళ్తుండగా ఆమెను అపహరించారు.
కారులో తనపై ముగ్గురూ అత్యాచారం చేసి, ఆ తర్వాత పూర్వీమార్గ్ వద్ద విసిరేసి వెళ్లిపోయారని ఆమె పోలీసులకు ఫిర్యాదుచేసింది. ఆమె కిడ్నాప్ కాగానే ఆమెతోపాటు ఉన్న స్నేహితురాలు పోలీసులకు ఫోన్ చేసి చెప్పింది. కారు నెంబరును ఆమె గుర్తుపెట్టుకోవడంతో నిందితులను పట్టుకోవడం సులభమైందని పోలీసులు తెలిపారు. బాధితురాలికి వైద్యపరీక్షలు చేయించగా అత్యాచారం జరిగిన విషయం కూడా నిర్ధారణ అయ్యిందన్నారు.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more