విమర్శలలో పదునైన పదాలను వాడే సీపీఐ నేత నారాయణ మరోసారి తన నోటికి పనిచెప్పాడు. శనివారం ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించి తెలుగు రాష్ట్రాల సీఎంలపై విరుచుకుపడ్డాడు. గవర్నర్, ఇరు రాష్ట్రాల సీఎంలను, ఆఖరికి నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తోసహా ఎవరినీ వదలకుండా అందరినీ ఏకీపడేశాడు. ఈ క్రమంలో అందరిపైన కాస్త ఘాటైన పదజాలాన్నే ఆయన వాడారు.
ఇద్దరు చంద్రులు పాలన మానేసి రాజకీయాలు మాత్రమే చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. ఇతర పార్టీ నేతలను లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారే తప్ప, పాలనపై ఏ మాత్రం దృష్టిసారించడం లేదంటూ మండిపడ్డారు. వారి మాటలు విని పార్టీ మారుతున్నవారంతా బడుద్ధాయిలంటూ సీరియస్ అయ్యారు. ముఖ్యమంత్రులిద్దరూ అడ్డగోలుగా దోచుకుంటున్నారని ఆరోపించారు. కొత్త నిర్మాణాల పేరుతో కేసీఆర్, అమరావతి పేరుతో చంద్రబాబు వ్యాపారం మొదలెట్టేశారన్నారు.
ఇక గవర్నర్ గురించి కాస్త పరుషమైన పదజాలాన్నే వాడారు. ఇద్దరు సీఎం గొడవలు పడుతుంటే దారిన పెట్టాల్సిన గవర్నరు ఆపని చేయలేకపోతున్నారని విమర్శించారు. ఇలాంటి పరిస్థితులుంటే గవర్నర్ గారు వంకాయలు తరుగుతున్నారా? అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చేష్టలుడిగి చూస్తుడటం తప్ప గవర్నర్ పొడిచేదేం లేదంటూ మండిపడ్డారు.
నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి కూడా విమర్శలు గుప్పించారు. ఎప్పుడో ఓ సారి మీడియా ముందుకు వచ్చి పవన్ నీతులు చెబుతున్నారని, అవి వినడానికి ప్రజలు సిద్ధంగా లేరని వ్యాఖ్యానించారు. ముద్రగడ దీక్ష, అరెస్ట్ లాంటి వాటితో రాష్ట్రం రావణకాష్టంలా మండుతుంటే, కాపులకు అండగా ఉంటానన్న పవన్ ఏం చేస్తున్నాడు, ఎక్కడున్నాడంటూ ప్రశ్నించాడు. హీరోగా వచ్చిన పవన్ కల్యాణ్ చివరకు రాజకీయాల్లో జోకర్గా మిగిలిపోతాడని ఎద్దేవా చేశాడు.
చివర్లో ఉద్యమకాలంలో కోదండరాంను వాడుకున్న టీఆర్ఎస్ ఇప్పడు విమర్శించడం సరైందని కాదని చెప్పారు. పాలనపై ఆయన చేసిన వ్యాఖ్యలను విశ్లేషించి ముందుకెళ్లాలే తప్ప నోటికి ఎంత వస్తే అంత మాట్లాడొద్దని టీఆర్ఎస్ నేతలను హెచ్చరించాడు.
భాస్కర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more