కర్ణాటకలో ‘రాజ్యసభ బజార్’ రాజకీయ దుమారం రేపి 24 గంటలు కూడా గడవలేదు. పెద్దల సభ సీటు కోసం ఎమ్మెల్యేలకు 5 నుంచి 10 కోట్లు ఎరవేయటం, ఓ ఎమ్మెల్యే చానెల్ గాలానికి చిక్కి స్టింగ్ ఆపరేషన్ లో ఆ వ్యవహారం అంతా బయటపడటం తెలిసిందే. ఈ వ్యవహారపై ఎన్నికల కమిషన్ తోసహా పలువురు నేతలు షాక్ కి గురయ్యారు. ముక్త కంఠంతో ఆ భాగోతాన్ని ఖండించారు. అయితే గుంపులో గొవింద ఎందుకనుకున్నాడో ఏమో మాజీ ప్రధాని, జేడీ సెక్యులర్ చీఫ్ దేవ గౌడ మాత్రం భిన్నంగా స్పందించారు. ఆ వ్యాఖ్యలు ఇప్పుడు ఇంకా దుమారం రేపుతున్నాయి.
ప్రస్తుత రాజకీయాలపై స్పందించాల్సిందిగా కోరిన మీడియాకు ఆయన షాకిచ్చే సమాధానాలిచ్చారు. ఇప్పటి రాజకీయాలను ప్రక్షాళన చేయాలనుకోవటం మూర్ఖత్వమే అవుతుందంటూ పేర్కొన్నారు. ప్రస్తుత రాజకీయాల్లో అవినీతి కామన్ గా మారిపోయింది. ఎమ్మెల్యేలకూ అవసరాలు ఉంటాయి! వచ్చే ఎన్నికల్లో ఖర్చుపెట్టుకోవడానికి కావాలి కదా. అయినా చిన్నపార్టీలను పెద్ద పార్టీలు టార్గెల్ చేయటం చాలా చిన్న విషయం, తప్పేం కాదంటూ వ్యాఖ్యానించాడు. రాజకీయ కుట్రలో భాగంగానే తన ఎమ్మెల్యేను ఇరిక్కించారంటూ ఇంకోవైపు దొరికిన ఎమ్మెల్యేలను వెనకేసుకొచ్చారు. అయితే మీడియాను పిచ్చోళ్లను చేసేందుకే తమ ఎమ్మెల్యే కావాలనే స్టింగ్లో పాల్గొన్నాడని జేడీఎస్ నేత, మాజీ సీఎం కుమారస్వామి చెబుతుండటం విశేషం. ఇంకోవైపు మాజీ పీఎం రాజకీయ వ్యభిచారాన్ని ప్రోత్సహిస్తున్నారంటూ విపక్షాలు మండిపడుతున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతిచ్చేవారికి రూ.10 కోట్లు ఇచ్చేలా బేరం జరిగిందని బీజేపీ నేత, మాజీ సీఎం యడ్యూరప్ప ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, వేలకోట్ల బ్యాంకు రుణాలను ఎగవేసి, విదేశాలకు పోరిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు మద్దతుగా మాట్లాడి దేవగౌడ విమర్శలు ఎదుర్కున్నాడు కూడా.
భాస్కర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more