సరిగ్గా రెండు నెలలు తరువాత పక్షం రోజుల పాటు అత్యంత ఘనంగా ఒలంపిక్స్ పోటీలను నిర్వహించి తమ ప్రతిష్టను మరింతగా మెరుగుపర్చుకోవాలని, అందుకు ఏర్పాట్లలో తనమునకలైన బ్రెజిల్ ప్రభుత్వం ప్రయత్నాలకు అ దేశ యువకులు అప్రదిష్టను మూటగట్టేలా చేశారు. సరిగ్గా ఆగస్టు 5 నుంచి ఒలంపిక్స్కు ఆతిధ్యమివ్వనున్న బ్రెజిల్ నగరం రియో డి జెనీరోలో అత్యంత దారుణ ఘటనకు అక్కడి యువతపాల్పడ్డారు. చిత్తకార్తి వీధి కుక్కలు కూడా చేయనంత దారుణంగా ఓ పదహారేళ్ల మైనర్ బాలికపై అత్యంత పాశవికంగా సామూహిక అత్యాచారం చేశారు.
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటనను మించేలా తలపిస్తున్న ఈ ఘటనలో ఓ 16 ఏళ్ల బాలికకు బలవంతంగా మత్తు పదార్థాలు ఇచ్చి.. ఆ తరువాత అమెపై 33 మంది యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై బ్రెజిల్ మహిళా సంఘాలు, సమాజిక కార్యకర్తలు మండిపడుతున్నారు. దారుణానికి పాల్పడిన వారిలో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. రియోలోని ఫవేలా ప్రాంతానికి చెందిన ఓ బాలిక తన 20 ఏళ్ల బాయ్ఫ్రెండ్ వినతి మేరకు కలువడానికి వెస్టర్న్ ఫ్రింజ్లోని అతని గదికి వెళ్లింది. అయితే అలా వచ్చిన తన గర్ల్ ఫ్రెండ్ కు మత్తు పదార్థాలను ఇచ్చిన బాయ్ఫ్రెండే ఆమె పాలిట కాలయముడిలా మారాడు. ఆ తరువాత వారు డ్రగ్స్ తీసుకుని ఆ బాలికను 36 గంటల పాటు నిర్భందించి లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఆన్లైన్లో పోస్ట్ చేయడంతో గతవారం జరిగిన ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
ఆ తర్వాత ఏం జరిగిందో తనకు తెలియదని, ఆ మరుసటి రోజు పక్క భవంతిలో తాను నగ్నంగా పడిఉన్నానని, చుట్టూ కొందరు తుపాకులు పట్టుకుని ఉన్నారని పోలీసులకు చెప్పింది. నీరసించిపోయిన బాధితురాలు మగవాళ్ల దుస్తులు ధరించి ఇంటికి తిరిగివచ్చిందని, ఏం జరిగిందన్న విషయాన్ని చెప్పలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. రెండు రోజుల తర్వాత బాధితురాలు నగ్నంగా, అపస్మారక స్థితిలో ఉన్నప్పటి వీడియో ట్విట్టర్లో కనిపించింది. 40 సెకెన్ల నిడివిగల వీడియోను ఓ నిందితుడు పోస్ట్ చేశాడు. మరో నిందితుడు బాధితురాలితో అభ్యంతరకర పరిస్థితిలో ఉన్న ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేశాడు.
ఈ దృశ్యాలను నెటిజెన్లు షేర్ చేసుకున్నారు. ట్విట్టర్ యాజమాన్యం ఈ ఫొటోలను తొలగించే లోపే 500 లైక్లు వచ్చాయి. ఈ దారుణ ఘటనపై బ్రెజిల్లో దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమైంది. మహిళలపై దాడులు, అత్యాచార సంస్కృతి పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆన్లైన్లో హింసాత్మక చర్యల పోస్టింగ్స్ పెట్టడాన్ని నిరసించారు. దీంతో బ్రెజిల్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. బాధితురాలిని ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించిన పోలీసులు, కేసును దర్యాప్తు చేస్తున్నారు.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more