రాజకీయాలలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఎవరూ వుండరని బలంగా నమ్మె పార్టీ భారతీయ జనతా పార్టీ. అలాంటి పార్టీ ఏకపక్ష మెజరిటీని సాధించి కేంద్రంలో అధికారంలో వుండగా, విపక్ష పార్టీలను ఎప్పటికప్పుడు ముప్పు తిప్పలు పెడుతుండగా, ఆ పార్టీ కేంద్రమంత్రి మాత్రం విపక్ష పార్టీకి చెందిన అధినేత్రి సోనియాగాంధీపై మాత్రం ప్రశంసల జల్లు కురిపించారు. ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ పార్టీని నిత్యం దునుమాడే బీజేపీ సీనియర్ నేత, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తాజాగా ఆ పార్టీ అధినేత్రి సోనియాగాంధీని ప్రశంసించారు.
కాంగ్రెస్ పార్టీని ఐక్యంగా ఉంచే శక్తి సోనియా మాత్రమేనని, ఆమె లేకపోతే ఏనాడో ఆ పార్టీ విచ్ఛిన్నమయ్యేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్గాంధీని నియమించే విషయమై జరుగుతున్న చర్చపై ప్రశ్నించగా ఆయన ఈ మేరకు స్పందించారు. 'నాయకత్వం అనేది వారి అంతర్గత వ్యవహారం. సోనియాగాంధీ వల్లే కాంగ్రెస్ పార్టీ ఐక్యంగా ఉందని నేను చెప్పగలను. ఆమె లేకపోతే పార్టీ విచ్ఛిన్నమయ్యేది. వంశపారంపర్య రాజకీయాలను నేను ఆమోదించనప్పటికీ ఇది నా అభిప్రాయం' అని ఆయన పేర్కొన్నారు.
'వారసత్వ రాజకీయాలు ప్రజాస్వామ్యంలో పనికిమాలినవి అయినా కాంగ్రెస్ పార్టీలోని కొందరు నేతలు, మద్దతుదారులకు మాత్రం అవే ప్రీతిపాత్రంగా కనిపిస్తాయి. కానీ, నిజాన్ని మాత్రం ఒప్పుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఐక్యత కారకం సోనియానే' అని ఆయన పీటీఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. అయితే, నాయకురాలిగా ఆమె నాయకత్వం విజయవంతం కాలేదని తాజా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఉటంకిస్తూ పేర్కొన్నారు. విదేశీ మహిళ ప్రధాని కారాదని కొరివిపెట్టి అమెకు ప్రధాని పదవి దక్కకుండా చేసిన బీజేపి.. ఈ మాత్రం అయిన అమెను ప్రశంసించిందంటే విడ్డూరంగానే వుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more