ప్రపంచంలోనే అతి చవకైనా స్మార్ట్ ఫోన్ అందిస్తున్నామంటూ గత కొన్ని మాసాల క్రితం ఫ్రీడమ్ 251 వచ్చి.. సంచలనాలకు తెరలేపగా, దాని వెనుక పెద్ద మోసమే వున్నదంటూ.. అరోపణలు బయటిరావడంతో ఆ సంస్థపై నిఘా ఏర్పాటుతో అనేక విషయాలు తెరపైకి వచ్చాయి. అయితే ఆ తరువాత 800 రూపాయలకే స్మార్ట్ పోన్ అందిస్తామని మరో స్మార్ట్ ఫోన్ వాళ్లు కూడా ప్రకటించేశారు, ఈ తరుణంలోనే మరో అత్యంత చౌకైన స్మార్ట్ ఫోన్ వచ్చేసింది. ఇది ఏకంగా ఫ్రీడమ్ 251 కన్నా తక్కువ ధరకు ఇస్తామని ప్రకటించింది.
నమోటెల్ డాట్కామ్ సంచలన ప్రకటన చేసింది. 99 రూపాయలకే స్మార్ట్ ఫోన్ అంటూ మొబైల్ ప్రియుల గుండెల్లో గుబులు పుట్టించింది. అరుదైన రీతిలో 99 రూపాయలకే అచ్చేదిన్ పేరిట స్మార్ట్ఫోన్ను పంపిణీ చేస్తామని బెంగళూరులో ప్రకటించింది. నగరంలో మంగళవారం నమోటెల్ కంపెనీ సీఈఓ మాధవరెడ్డి మీడియాకు ఈ వివరాలు ప్రకటించారు. మే 17న ప్రారంభమైన బుకింగ్ లు మే 25 తో ముగుస్తాయని వెల్లడించారు.
తమ స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారు నమోటెల్. డాట్కామ్లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఐడి, పాస్వర్డ్ను పొందాలన్నారు. ఇందులో లాగిన్ అయ్యాక ఆన్లైన్ రూపంలో నగదు చెల్లించాలి. ఆ తర్వాత బీఎంబీ రెఫరెన్స్ ఐడి అందుతుంది. వాటి ఆధారంగా నమోటెల్ డాట్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఫోటో, ఆధార్కార్డును జతచేస్తే స్మార్ట్ఫోన్ ను అందిస్తామన్నారు. బి మై బ్యాంకర్లో సభ్యుడిగా చేరితే మాత్రమే నోవాటెల్లో రిజిస్ట్రేషన్ సాధ్యమన్నారు. బ్లాక్ అండ్ వైట్ రెండు రంగుల్లో అందుబాటులోకి రానున్న ఈ మొబైల్ ధరను 2వేల రూపాయలను తగ్గించినట్టు ప్రకటించింది. కంపెనీ క్యాష్ ఆన్ డెలీవరీ సదుపాయం కూడా కల్పించినట్టు రెడ్డి చెప్పారు.
దీని ఫీచర్స్ ఇలా ఉన్నాయి.
1.3 గిగా హెడ్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్
1 జీబీ రామ్ , 3జీ
4 జీబీ రామ్
3 మెగా పిక్సెల్ ఫ్రంట్, 2 మెగా పిక్సెల్ రియర్ కెమెరా
డ్యూయల్ సిమ్, 4 ఇంచ్ హెచ్ డీ డిస్ ప్లే
1325 ఎంఏహెచ్ బ్యాటరీ
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more