తండ్రి మీద కొడుకుకు ఉండే ప్రేమకు ఎవరూ విలువకట్టలేరు. తన పుట్టుకకు కారణమై, విద్యా బుద్దులు నేర్పిన తండ్రికి ఏ కొడుకైనా దాసుడే. అయితే కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి.. తన తండ్రి విగ్రహానికి బంగారుతో పూత పూయించారు. అయితే విషయం పోలీసుల దాకా రావడంతో అయ్యాగారి అసలు స్వరూపం బయటపడింది. ఇంతకీ అయ్యవార్ల వృత్తి ఏంటనుకుంటున్నారు..? దొంగతనం. చిల్లర చిల్లర దొంగతనాలు కాకుండా భారీగా చోరీలు చెయ్యడం బారీగా మూటగట్టుకోవడం అతడికి బాగా అలవాటైంది. అలా అలవాటుపడిన నవగంభాయ్ అనే వ్యక్తి గురించి పోలీసులు షాకవుతున్నారు. పాపం తన తండ్రి మీద ఉన్న ప్రేమను నిరూపించడానికి దొంగగారు ఇలా ఏకంగా తండ్రి విగ్రహాన్ని బంగారుే తాపడం పట్టించాలని అనుకున్నారు. కానీ అక్కడే దొరికిపోయారు.
కర్ణాటకలోని హొసకెరెహళ్ళిలో ఉంటున్న తలపాడ్ నవగంభాయ్ వురపు శంకర్ స్వస్థలం గుజరాత్లో ఉంది. 2007లో కుటుంబంతో సహా ఇక్కడికి వలస వచ్చాడు. ఏడో తరగతి ఉత్తీర్ణుడైన నవగంభాయ్కి అతని తండ్రే గురువు. తలపాడ్ పంఝభాయ్ తన కొడుకు నవగంభాయ్ని దొంగతనాలు చేయడంలో నిపుణుడిగా తీర్చిదిద్దాడు. నవగంభాయ్ తాను నేర్చుకున్న విద్యను ఆచరణలో పెట్టి దాదాపు 3 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను, ఇతర వస్తువులను దొంగతనం చేశాడు. వాటిని గుజరాత్లోని తన స్నేహితుడు రాకేష్కు పంపించేవాడు. తాను కట్టించిన ఓ గుడిలో తన తండ్రి పంఝభాయ్, సోదరుడు గోవింద్ విగ్రహాలను పెట్టించాడు. రాకేష్ చేత ఆ రెండు విగ్రహాలకు బంగారు పూత పూయించాడు.నవగంభాయ్ ఇచ్చిన సమాచారం మేరకు గుజరాత్లో అతని వ్యాపారాలను నిర్వహిస్తున్న ఇంజినీరింగ్ విద్యార్థి మితేష్ పాంచాల్ను, విగ్రహాల కోసం నవగంభాయ్ పంపిన బంగారాన్ని కరిగించి, ఉపయోగించిన రాకేష్ను అరెస్టు చేశారు. నవగంభాయ్పై 50 దొంగతనం కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more