తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నారని కన్న బిడ్డను, తల్లిలాంటి అత్తనూ ప్రియుడితో కలిసి చంపింది ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని. అనంతరం భర్తను కూడా దారుణంగా చంపించే ప్రయత్నం చేసింది. అమ్మతనానికే మాయని మచ్చను తీసుకొచ్చిన ఈ దుస్సంఘటన 2014లో కేరళలోని తిరువనంతపురంలో చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి తిరువనంతపురం ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి సంచలన తీర్పు ఇచ్చారు. ఈ దారుణానికి పాల్పడిన నిందితుడికి కోర్టు మరణశిక్ష విధించగా, నిందితురాలికి జీవిత ఖైదు శిక్ష ఖరారు చేసింది. నిందితులిద్దరికి ఒక్కొక్కరికీ రూ.50లక్షల చొప్పునా జరిమానా కూడా విధించింది. కన్నబిడ్డను, తల్లిలాంటి అత్తను చంపించిన నిందితురాలు అనుశాంతి ‘ అమ్మ తనానికే మాయని మచ్చ తెచ్చింద’ని న్యాయమూర్తి తీవ్రంగా వ్యాఖ్యానించారు.
తిరువనంతపురంలోని టెక్నో పార్కు సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్న నినో మ్యాథ్యూస్, అనుశాంతి మధ్య అక్రమ సంబంధం కొనసాగుతోంది. తమ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుగా ఉన్నారంటూ 2014లో అను తమ మూడేళ్ల కూతురు స్వస్తికను, ఆమె అత్త ఒమనా ను దారుణంగా ప్రియుడు నినో మ్యాథ్యూ చంపేశాడు. అనుశాంతి భర్త లిజేష్నూ చంపేందుకు ప్రయత్నించగా తీవ్రగాయాలతో తప్పించుకున్నాడు. ఈ కేసులో తీర్పు వెలువరించిన న్యాయమూర్తి ‘ ఇది అత్యంత క్రూరమైన, హేయమైన నేరమని వ్యాఖ్యానించారు. అందుకే మ్యాథ్యూకు మరణశిక్ష విధిస్తున్నానని న్యాయమూర్తి స్పష్టం చేశారు. కాగా, నిందితులకు విధించిన కోటి రూపాయల జరిమానాను బిడ్డను కోల్పోయిన అనుశాంతి భర్త లిజేష్కు రూ.50లక్షలు, భార్యను కోల్పోయిన అను మామ థంకప్పన్కు రూ.30లక్షలు పరిహారం చెల్లించాలని జడ్జీ ఆదేశించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more