పవర్ స్టార్, సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇక సినిమాలకు దూరంగా, కీలక, ప్రత్యక్ష రాజకీయాలకు దగ్గరగా వుంటానని, 2019 నాటి ఎన్నికలలో తమ పార్టీ ప్రత్యక్షంగా ఎన్నికల బరిలో నిలుస్తుందని ప్రకటించిన నాటి నుంచి రాష్ట్రంలో ఎక్కడ చూసినా, ఏ నలుగురు మిత్రులు కలసినా, గ్రామాల నుంచి పట్టణాలు, నగరాల వరకు ఇదే అంశం చర్చనీయాంశమైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ‘సర్దార్ గబ్బర్ సింగ్’ రిలీజ్ తర్వాత పవన్ ఇంటర్వ్యూల కోసం లీడింగ్ తెలుగు ఛానళ్లన్ని ఆయన కోసం క్యూ కట్టాయి. ఆయన మాట్లాడిన నాలుగు మాటలను పదే పదే ప్రసారం చేస్తూ తమ రేటింగ్ పెంచుకునేందుకు పోటీ పడ్డాయి,
ఈ ఇంటర్వ్యూల్లో తన భవిష్యత్ రాజకీయ జీవితం గురించి.. వర్థమాన రాజకీయాల గురించి అడిగిన వివిధ ప్రశ్నలకు జనసేనాని సవివిరమైన సమధానం ఇచ్చారు. తెలుగు చానల్స్ అన్నింటికీ ప్రముఖ ఛానెల్స్ నుంచి అంతమాత్రంగా రేటింగ్ వున్న అన్ని ఛానెల్స్ కు పవన్ కల్యాణ్ ఇంటర్వ్యూ ఇచ్చారు, ఏ ఛానెల్ వారు వచ్చి సంప్రదించినా కాదనకుండా, లేదనకుండా ఆయన తన సమయాన్ని కేటాయించి ఆయా ఛానెళ్ల ద్వారా తన మనస్సులోని మాటలను తన అభిమానులతో, జనసేన కార్యకర్తలతో పంచుకున్నారు,
అయితే పవన్ కల్యాణ్ ఇంటర్వ్యూను ఓ ప్రముఖ తెలుగు ఛానెల్ మాత్రం నిరాకరించింది. గెలుపు అంచుల నుంచి తమను పరాజయంలోకి నెట్టివేయడానికి కారణమైన జనసేనాధిపతి ఇంటర్వ్యూను మాత్రం ‘సాక్షి’ ఛానల్ వద్దనుకుందట. రాష్ట్ర విభజన తరువాత తొలిసారిగా ఎన్నికలకు వెళ్లిన తరుణంలో తమ అంచనాలను, తమ పార్టీకి పడే ఓట్లను తన అభిమానుల ద్వారా చీల్చీ, ప్రత్యర్థి పార్టీ తెలుగు దేశం పార్టీకి విజయాన్ని అందించడంలో కీలక భూమిక పోషించి, ప్రత్యక్ష కారణమైన పవన్ కల్యాణ్ ఇంటర్వ్యూ మాత్రం సాక్షి వద్దనుకుందట.
తొలుత అందరి మాదరిగానే పవన్ ఇంటర్వ్యూ చేద్దామని నిర్ణయించుకుని ఆఖరి నిమిషంలో తమ ‘పెద్ద’ నుంచి వచ్చిన ఆదేశాలతో ఆగిపోయిందట. అదెలా అంటే.. పవన్ కల్యాణ్ ఇంటర్వ్యూ కోసం ‘సాక్షి’ ఆయన పీఆర్ఓ ను సంప్రదించింది. పవన్ సుముఖంగానే వున్నారు.. మీరు ఫలానా సమయంలో రండీ అంటూ అపాయింట్ మెంట్ కూడా ఇచ్చేశారట. ఇక ఇంటర్వ్యూ కోసం బయలుదేరుతున్న సాక్షి టీమ్ ఆఖరి నిమిషంలో రాలేమని చెప్పేసిందట. అయితే పవన్ ఇంటర్వ్యూ గురించి ఆ ఛానల్ ‘పెద్ద’ కు సమాచారం వెళ్లడం.. ఆయన ఎట్టి పరిస్థితుల్లోను పవన్ కల్యాణ్ ను ఇంటర్వ్యూ చేయవద్దని ఆదేశించడంతో.. ‘సాక్షి’ ఛానల్ పవన్ ఇంటర్వ్యూ తీసుకోలేదని సమాచారం.
పవన్ కల్యాణ్ కు రాజకీయంగా వైసీపీ తో ఉన్న శతృత్వంతో పాటు.. తమ పార్టీకి కేవలం ఆరు లక్షల ఓట్లను అడ్డుకుని అధికారాన్ని అందుకోనీయకుండా చేసింది పవన్ కల్యాన్ అని భావించిన ఛానల్ పెద్ద ఇంటర్వ్యూ ను తమ ఛానల్ లో ప్రసారం చేయడం అనవసరమని భావించినట్లు, అందుకనే ఆ ఛానల్ పెద్ద ఈ నిర్ణయానికి వచ్చాడని తెలుస్తుంది. అయితే గత కొంత కాలం క్రితం పవన్ కల్యాన్ గురించి పాజిటివ్ గా వచ్చిన కథనాలు కాస్తా.. ఇప్పుడు నెటిగివ్ గా మారిపోయాట. ఇందుకు భూమానాగిరెడ్డి కూడా మరో కారణమని తెలుస్తుంది.
భూమానాగిరెడ్డి సతీమణి శోభానాగిరెడ్డి నియోజకవర్గంలో అమె కూతురు అఖిలప్రియ పోటీ చేసిన సందర్భంగా అక్కడ టీడీపీ అభ్యర్థిని పోటీ లేకుండా చేయడంలో పవన్ కల్యాణ్ ఏకంగా చంద్రబాబుతో సంప్రదించి చర్యలు తీసుకున్నారట, అయితే అక్కడ గెలుపోందిన అఖిలప్రియ, భూమానాగిరెడ్డిలు ఇటీవల టీడీపీలో చేరిపోవడం, దీని వెనుక కూడా పవన్ కల్యాన్ ప్రమేయముందని భావిచిన వైసీపీ పెద్ద ఇక పవన్ కల్యాన్ గురించి కరెంట్ హ్యాపెనింగ్స్ మాత్రమే రాయాలని, అంతేకాని విశ్లేషణలు వద్దని కూడా నిర్ణయం తీసుకున్నారట.
అంతకుముందు సాక్షి పేపర్ లో కూడా పవన్ కల్యాణ్ తో ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా ఇంటర్వ్యూను చేశారు తప్ప.. రాజకీయ అంశాల జోలికి వారు కూడా పోలేదు! చిన్నా, పెద్దా తేడాలేకుండా అన్ని ఛానెళ్ల ద్వారా ప్రసారమవుతున్న పవన్ కల్యాణ్ ఇంటర్వ్యూను తమ ఒక్క ఛానల్ ప్రసారం చేయనంత మాత్రన పవన్ కు వచ్చే నష్టమేమి లేదని జనసేన వర్గాలు అంటున్నాయి. పవన్ ఇంటర్వ్యూలతో సాక్షి రేటింగ్ పెంచుకునే అంశంలో సాక్షి వెనకబడిందని అంటున్నారు. రాజకీయాలలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు వుండరన్న విషయాన్ని మన‘సాక్షి’ అంగీకరిస్తుందో..? లేదో..? వేచి చూడాల్సిందే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more