పవర్ స్టార్, సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇక సినిమాలకు దూరంగా, కీలక, ప్రత్యక్ష రాజకీయాలకు దగ్గరగా వుంటానని, 2019 నాటి ఎన్నికలలో తమ పార్టీ ప్రత్యక్షంగా ఎన్నికల బరిలో నిలుస్తుందని ప్రకటించిన నాటి నుంచి రాష్ట్రంలో ఎక్కడ చూసినా, ఏ నలుగురు మిత్రులు కలసినా, గ్రామాల నుంచి పట్టణాలు, నగరాల వరకు ఇదే అంశం చర్చనీయాంశమైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ‘సర్దార్ గబ్బర్ సింగ్’ రిలీజ్ తర్వాత పవన్ ఇంటర్వ్యూల కోసం లీడింగ్ తెలుగు ఛానళ్లన్ని ఆయన కోసం క్యూ కట్టాయి. ఆయన మాట్లాడిన నాలుగు మాటలను పదే పదే ప్రసారం చేస్తూ తమ రేటింగ్ పెంచుకునేందుకు పోటీ పడ్డాయి,
ఈ ఇంటర్వ్యూల్లో తన భవిష్యత్ రాజకీయ జీవితం గురించి.. వర్థమాన రాజకీయాల గురించి అడిగిన వివిధ ప్రశ్నలకు జనసేనాని సవివిరమైన సమధానం ఇచ్చారు. తెలుగు చానల్స్ అన్నింటికీ ప్రముఖ ఛానెల్స్ నుంచి అంతమాత్రంగా రేటింగ్ వున్న అన్ని ఛానెల్స్ కు పవన్ కల్యాణ్ ఇంటర్వ్యూ ఇచ్చారు, ఏ ఛానెల్ వారు వచ్చి సంప్రదించినా కాదనకుండా, లేదనకుండా ఆయన తన సమయాన్ని కేటాయించి ఆయా ఛానెళ్ల ద్వారా తన మనస్సులోని మాటలను తన అభిమానులతో, జనసేన కార్యకర్తలతో పంచుకున్నారు,
అయితే పవన్ కల్యాణ్ ఇంటర్వ్యూను ఓ ప్రముఖ తెలుగు ఛానెల్ మాత్రం నిరాకరించింది. గెలుపు అంచుల నుంచి తమను పరాజయంలోకి నెట్టివేయడానికి కారణమైన జనసేనాధిపతి ఇంటర్వ్యూను మాత్రం ‘సాక్షి’ ఛానల్ వద్దనుకుందట. రాష్ట్ర విభజన తరువాత తొలిసారిగా ఎన్నికలకు వెళ్లిన తరుణంలో తమ అంచనాలను, తమ పార్టీకి పడే ఓట్లను తన అభిమానుల ద్వారా చీల్చీ, ప్రత్యర్థి పార్టీ తెలుగు దేశం పార్టీకి విజయాన్ని అందించడంలో కీలక భూమిక పోషించి, ప్రత్యక్ష కారణమైన పవన్ కల్యాణ్ ఇంటర్వ్యూ మాత్రం సాక్షి వద్దనుకుందట.
తొలుత అందరి మాదరిగానే పవన్ ఇంటర్వ్యూ చేద్దామని నిర్ణయించుకుని ఆఖరి నిమిషంలో తమ ‘పెద్ద’ నుంచి వచ్చిన ఆదేశాలతో ఆగిపోయిందట. అదెలా అంటే.. పవన్ కల్యాణ్ ఇంటర్వ్యూ కోసం ‘సాక్షి’ ఆయన పీఆర్ఓ ను సంప్రదించింది. పవన్ సుముఖంగానే వున్నారు.. మీరు ఫలానా సమయంలో రండీ అంటూ అపాయింట్ మెంట్ కూడా ఇచ్చేశారట. ఇక ఇంటర్వ్యూ కోసం బయలుదేరుతున్న సాక్షి టీమ్ ఆఖరి నిమిషంలో రాలేమని చెప్పేసిందట. అయితే పవన్ ఇంటర్వ్యూ గురించి ఆ ఛానల్ ‘పెద్ద’ కు సమాచారం వెళ్లడం.. ఆయన ఎట్టి పరిస్థితుల్లోను పవన్ కల్యాణ్ ను ఇంటర్వ్యూ చేయవద్దని ఆదేశించడంతో.. ‘సాక్షి’ ఛానల్ పవన్ ఇంటర్వ్యూ తీసుకోలేదని సమాచారం.
పవన్ కల్యాణ్ కు రాజకీయంగా వైసీపీ తో ఉన్న శతృత్వంతో పాటు.. తమ పార్టీకి కేవలం ఆరు లక్షల ఓట్లను అడ్డుకుని అధికారాన్ని అందుకోనీయకుండా చేసింది పవన్ కల్యాన్ అని భావించిన ఛానల్ పెద్ద ఇంటర్వ్యూ ను తమ ఛానల్ లో ప్రసారం చేయడం అనవసరమని భావించినట్లు, అందుకనే ఆ ఛానల్ పెద్ద ఈ నిర్ణయానికి వచ్చాడని తెలుస్తుంది. అయితే గత కొంత కాలం క్రితం పవన్ కల్యాన్ గురించి పాజిటివ్ గా వచ్చిన కథనాలు కాస్తా.. ఇప్పుడు నెటిగివ్ గా మారిపోయాట. ఇందుకు భూమానాగిరెడ్డి కూడా మరో కారణమని తెలుస్తుంది.
భూమానాగిరెడ్డి సతీమణి శోభానాగిరెడ్డి నియోజకవర్గంలో అమె కూతురు అఖిలప్రియ పోటీ చేసిన సందర్భంగా అక్కడ టీడీపీ అభ్యర్థిని పోటీ లేకుండా చేయడంలో పవన్ కల్యాణ్ ఏకంగా చంద్రబాబుతో సంప్రదించి చర్యలు తీసుకున్నారట, అయితే అక్కడ గెలుపోందిన అఖిలప్రియ, భూమానాగిరెడ్డిలు ఇటీవల టీడీపీలో చేరిపోవడం, దీని వెనుక కూడా పవన్ కల్యాన్ ప్రమేయముందని భావిచిన వైసీపీ పెద్ద ఇక పవన్ కల్యాన్ గురించి కరెంట్ హ్యాపెనింగ్స్ మాత్రమే రాయాలని, అంతేకాని విశ్లేషణలు వద్దని కూడా నిర్ణయం తీసుకున్నారట.
అంతకుముందు సాక్షి పేపర్ లో కూడా పవన్ కల్యాణ్ తో ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా ఇంటర్వ్యూను చేశారు తప్ప.. రాజకీయ అంశాల జోలికి వారు కూడా పోలేదు! చిన్నా, పెద్దా తేడాలేకుండా అన్ని ఛానెళ్ల ద్వారా ప్రసారమవుతున్న పవన్ కల్యాణ్ ఇంటర్వ్యూను తమ ఒక్క ఛానల్ ప్రసారం చేయనంత మాత్రన పవన్ కు వచ్చే నష్టమేమి లేదని జనసేన వర్గాలు అంటున్నాయి. పవన్ ఇంటర్వ్యూలతో సాక్షి రేటింగ్ పెంచుకునే అంశంలో సాక్షి వెనకబడిందని అంటున్నారు. రాజకీయాలలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు వుండరన్న విషయాన్ని మన‘సాక్షి’ అంగీకరిస్తుందో..? లేదో..? వేచి చూడాల్సిందే.
(And get your daily news straight to your inbox)
Aug 11 | ఉచిత పధకాలను వ్యతిరేకిస్తున్న కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ తీరును దుయ్యబడుతూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు. దేశంలోని ప్రజల సంక్షేమాన్ని కాంక్షించే ప్రభుత్వాలుగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఉండాలని రాజ్యంగంలోనే ఉందని..... Read more
Aug 11 | అమరావతి రాజధాని విషయంలో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. రాజధాని అమరావతి నిర్మాణం కోసం సిద్ధం చేసిన డిజైన్లను తీసుకోనందుకు ఫోస్టర్ అండ్ పార్టనర్స్ కంపెనీ సుప్రీంకోర్టులో మధ్యవర్తిత్వ పిటిషన్ దాఖలు... Read more
Aug 11 | విమానంలో ధూమపానం అత్యంత ప్రమాదకర పరిణామాలకు దారితీస్తుంది. పొరపాటున ఊహించనది జరిగితే అందరి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయంతే! అలాంటి చోట నియమాలు. భద్రతా నిబంధనలను పూర్తిగా విస్మరిస్తూ, స్పైస్జెట్ విమానంలో ఓ ఇన్స్టా సెలబ్రిటీ... Read more
Aug 11 | ఎన్నికలకు ముందు ఉచిత హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని అమలుపర్చడంలో విఫలమైన రాజకీయ పార్టీల గుర్తింపును రద్దు చేయడం సమంజసం కాదని దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఉచిత హామీలపై... Read more
Aug 11 | తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్, బీజేపీల మధ్య రాజకీయ యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ఇటీవల టీఆర్ఎస్కు వ్యతిరేకంగా కేసీఆర్ను టార్గెట్ చేస్తూ బీజేపీ సరికొత్త డిజిటల్ బోర్డు ప్రచారానికి తెరలేపింది. తెలంగాణలో సీఎం కేసీఆర్... Read more