KCR and Chandrababu wish telugu people on Ugadi

Kcr and chandrababu wish telugu people on ugadi

Telugu, Telugu people, KCR, Chandrbabu naidu, Narasimhan

Telangana cm KCR and Governor narasimhan wish all very best in this new telugu year. AP CM Chandrababu Naidu also wish every with happyness.

తెలుగు వారి సంక్షేమాన్ని కోరిన చంద్రబాబు, కేసీఆర్

Posted: 04/08/2016 08:36 AM IST
Kcr and chandrababu wish telugu people on ugadi

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది అందరికి అంతా మంచే జరగాలని ఆయన ఆకాంక్షించారు. హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలుగు సంవత్సరాది ఉగాదిని పురస్కరించుకుని రెండు రాష్ట్రాల ప్రముఖులకు గవర్నర్ తేనీటి విందు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్.. పలువురు మంత్రులు, రాజకీయ నేతలు, ప్రముఖులు పాల్గొన్నారు. ఎప్పుడూ కార్పొరేట్ ఉద్యోగిలా సూటు, బూటులో దర్శనమిచ్చే గవర్నర్ నరసింహన్.. తెలుగు వారి పండుగ వేళ.. సంప్రదాయ దుస్తుల్లో సందడి చేశారు. పంచాంగ శ్రవణంతో పాటు.. సాంస్కృతిక కార్యక్రమాలనూ రాజ్ భవన్ లో నిర్వహించారు.

దుర్ముఖి నామ సంవత్సరం అయినంత మాత్రాన భయపడాల్సిన పని లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఈ ఏడాది పేరుకి దుర్ముఖి అయినంత మాత్రాన అనర్ధాలు జరగవని, రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని పండితులు చెప్పడం హర్షణీయమన్నారు. రాజ్ భవన్ లో గవర్నర్ నిర్వహించిన ఉగాది వేడుకల్లో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ ఏడాది తెలుగు రాష్ట్రాలకు మంచి ఫలితాలు వస్తాయన్నారు కేసీఆర్. గవర్నర్ నరసింహన్ స్వతహాగా తమిళులైనప్పటికీ తెలుగు సంప్రదాయాన్ని ఆదరించడం ముదావహమన్నారు కేసీఆర్. ఉగాది తెలుగు ప్రజలకు ఎంతో విశిష్ఠమైన పండుగ అన్న కేసీఆర్.. తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది వేడుకల్లో భాగంగా.. కేసీఆర్ దంపతులను గవర్నర్ దంపతులు సత్కరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telugu  Telugu people  KCR  Chandrbabu naidu  Narasimhan  

Other Articles